SGSTV NEWS online
Andhra PradeshCrime

Tadipatri: వేట కొడవలితో దాడి.. చికిత్స పొందుతూ యువకుడి మృతి



తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం చోటు చేసుకుంది. యువకుడిని వెంటాడి వేట కొడవలితో నరికి చంపిన ఘటన కలకలం రేపింది. గత కొంతకాలగా హర్షవర్ధన్, నాగరాజు మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి హర్షవర్ధన్ నాగరాజు ఇంటికి వెళ్లి చంపుతానని బెదిరించాడు. దీంతో నాగరాజు వేటకొడవలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన హర్షవర్ధన్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

Also read

Related posts