తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం చోటు చేసుకుంది. యువకుడిని వెంటాడి వేట కొడవలితో నరికి చంపిన ఘటన కలకలం రేపింది. గత కొంతకాలగా హర్షవర్ధన్, నాగరాజు మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి హర్షవర్ధన్ నాగరాజు ఇంటికి వెళ్లి చంపుతానని బెదిరించాడు. దీంతో నాగరాజు వేటకొడవలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన హర్షవర్ధన్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
Also read
- నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే
- Viral News: చెప్తే అర్థం చేసుకుంటారనుకుంది.. తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు..
- Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
- Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
- Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది





