పల్నాడు జిల్లా : కోటప్పకొండ వేద పాఠశాలలో ఆగమం శాస్త్రం 4వ ఏడాది చదువుతున్న విద్యార్థి కుందుర్తి సాయి శివ సూరజ్ (16) వసతి గృహం గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు జిల్లా కైకలూరు మండలం భుజబాల పట్నం గ్రామానికి చెందిన సాయి శివ సూరజ్ అందరితో కలివిడిగా స్నేహంగా మెలిగే వాడని బుధవారం రాత్రి కూడా అందరితో సరదాగా గడిపారని తోటి స్నేహితులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పౌరోహిత్య విద్యను అభ్యసిస్తున్న సాయి శివ సూరజ్ ఆత్మహత్యతో తోటి విద్యార్థులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. సమాచారం అందుకున్న రూరల్ వేద పాఠశాల వద్దకు చేరుకొని పరిస్థితి సమీక్షించారు. మృతదేహాన్ని నరసరావుపేట ఏరియా ఆస్పత్రి శవాగారానికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు
Also Read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!