పల్నాడు జిల్లా : కోటప్పకొండ వేద పాఠశాలలో ఆగమం శాస్త్రం 4వ ఏడాది చదువుతున్న విద్యార్థి కుందుర్తి సాయి శివ సూరజ్ (16) వసతి గృహం గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు జిల్లా కైకలూరు మండలం భుజబాల పట్నం గ్రామానికి చెందిన సాయి శివ సూరజ్ అందరితో కలివిడిగా స్నేహంగా మెలిగే వాడని బుధవారం రాత్రి కూడా అందరితో సరదాగా గడిపారని తోటి స్నేహితులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పౌరోహిత్య విద్యను అభ్యసిస్తున్న సాయి శివ సూరజ్ ఆత్మహత్యతో తోటి విద్యార్థులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. సమాచారం అందుకున్న రూరల్ వేద పాఠశాల వద్దకు చేరుకొని పరిస్థితి సమీక్షించారు. మృతదేహాన్ని నరసరావుపేట ఏరియా ఆస్పత్రి శవాగారానికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు
Also Read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..