ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన
శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జాతర ముగింపు సందర్భంగా శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి సింహ వాహనంపై కొలువు తీర్చి కర్పూర హారతులు సమర్పించి మంగళ వాయిద్యాలు నడుమ తప్పెట్లు, డప్పు వాయిద్యాల మధ్య శ్రీ ముత్యాలమ్మ గ్రామోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఈవో ఎస్.వి నాగేశ్వరరావు మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Also read
- కూకట్పల్లిలో స్పా ముసుగులో వ్యభిచారం బట్టబయలు
- నిశ్చితార్థం అయ్యాక పెళ్లి చేసుకోనన్న యువకుడు
- అప్పుల బాధతో ముగ్గురు పిల్లలతో కలిసిబావిలోకి దూకిన తల్లి
- హత్య చేసి.. పక్కింటి దూలానికి వేలాడదీసి!
- భర్తకు రెండో పెళ్లి మాటలతో వేధింపులు?.. టీచర్ ఆత్మహత్య





