SGSTV NEWS
Spiritual

Mohini Ekadashi: జీవితంలో సుఖ సంతోషాల కోసం మోహిని ఏకాదశి రోజున విష్ణువుకి ఈ పరిహారాలు చేయండి..



ఏకాదశి తిధికి హిందూ మతంలో చాలా పవిత్రమైన తిధి. విష్ణువుకి అంకితం చేయబడిన ప్రతి ఏకాదశి తిధికి ఒకొక్క విశిష్టత ఉంది. అదే విధంగా వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశిని మోహినీ ఏకాదశి అని అంటారు. ఈ రోజున విష్ణువు అవతారమైన “మోహిని” దేవిని పుజిస్తారు. ఈ రోజు చేసే ఉపవాసం ఆనందం శ్రేయస్సు కి మాత్రమే కాదు మోక్షాన్ని కూడా ఇస్తుందని నమ్మకం.

వైశాఖ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశిని మోహినీ ఏకాదశిగా జరుపుకుంటారు. మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున విష్ణువు మోహిని రూపాన్ని దాల్చి దేవతలకు అమృతాన్ని ప్రసాదించాడు. ఈ ఏకాదశి చాలా శుభప్రదమైనది. ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఉపవాసం ఉండి, ఆచారాల ప్రకారం విష్ణువును పూజించడంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మోహినీ ఏకాదశి రోజున విష్ణువుకు ఇష్టమైన వస్తువులను సమర్పించడం ద్వారా భక్తుల అదృష్టం ప్రకాశిస్తుందని .. జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్మకం.

2025 మోహిని ఏకాదశి తిథి పంచాంగం ప్రకారం వైశాఖ మాసం శుక్ల పక్ష ఏకాదశి తిధి మే 7న ఉదయం 10:19 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి మర్నాడు మే 8న మధ్యాహ్నం 12:29 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయ తిధి ప్రకారం మోహిని ఏకాదశి ఉపవాసం మే 8న జరుపుకోనున్నారు.

మోహిని ఏకాదశి రోజున విష్ణువు ఏ వస్తువులను సమర్పించాలంటే
తులసి దళాలు తులసి విష్ణువుకు చాలా ప్రియమైనది. ఏదైనా నైవేద్యం సమర్పిస్తుంటే తులసి దళాలను చేర్చడం తప్పనిసరి అని భావిస్తారు. తులసి లేకుండా విష్ణువు ఏ నైవేద్యాన్ని స్వీకరించడని నమ్ముతారు. మోహిని ఏకాదశి రోజున విష్ణువుకు తులసి దళాలు సమర్పించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరిగి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

పసుపు రంగు విష్ణువుకు పసుపు రంగు అంటే చాలా ఇష్టం. కనుక మోహిని ఏకాదశి రోజున అరటిపండు, మామిడి లేదా పసుపు రంగు స్వీట్లు వంటి పసుపు రంగు పండ్లు, పసుపు రంగు ఆహారాన్ని సమర్పించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. పసుపు రంగు శ్రేయస్సు , శుభాన్ని సూచిస్తుంది. వీటిని సమర్పించడం వలన విష్ణువు సంతోషపడతాడని నమ్మకం.

వెన్న, పటికబెల్లం విష్ణువుకు వెన్న , పటికబెల్లం నైవేద్యం పెట్టడం చాలా ఇష్టం. బాల గోపాలుడి రూపంలో ఆయన ఆరాధనలో ఈ నైవేద్యానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మోహిని ఏకాదశి రోజున వెన్న, చక్కెర మిఠాయిని నైవేద్యం పెట్టడం వల్ల జీవితంలో మాధుర్యం వస్తుంది. సంబంధాలలో ప్రేమ పెరుగుతుంది.

బియ్యం పాయసం బియ్యం, పాలు, చక్కెరతో తయారు చేసిన పాయసం విష్ణువుకు ఇష్టమైన నైవేద్యాలలో ఒకటి. మోహిని ఏకాదశి రోజున పాయసాన్ని సమర్పించడం ద్వారా ఇంట్లో ఆనందం, శాంతి ఉంటుంది. కుటుంబ సంబంధాలు బలపడతాయి.

పండ్లు విష్ణువుకు కాలానుగుణ పండ్లను సమర్పించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. విశ్వాసం, లభ్యత ప్రకారం మామిడి, అరటిపండు, పుచ్చకాయ లేదా సీతాఫలం వంటి ఏదైనా సీజనల్ పండ్లను నైవేద్యంలో చేర్చవచ్చు. పండ్లు నైవేద్యం పెట్టడం వల్ల జీవితంలో సానుకూలత, తాజాదనం వస్తుంది.

మోహినీ ఏకాదశి రోజున అన్నదానం ప్రాముఖ్యత
మోహిని ఏకాదశి రోజున విష్ణువుకు ఇష్టమైన వస్తువులను సమర్పించడం వల్ల ఆయన ఆశీర్వాదం లభించడమే కాకుండా జీవితంలోని అడ్డంకులు కూడా తొలగిపోతాయి. ఈ రోజు చేసే పూజ ఉపవాసం ఆత్మ శుద్ధి, ఆధ్యాత్మిక పురోగతికి కూడా ముఖ్యమైనది. నమ్మకం ప్రకారం విష్ణువును నిర్మలమైన హృదయంతో పూజించి, ఆయనకు ఇష్టమైన ఆహారాన్ని అందించడం ద్వారా ప్రత్యేక ఆశీర్వాదాలు పొందుతారు. జీవితంలో అదృష్టం, ఆరోగ్యం, సంపదను పొందుతారు.

Related posts

Share this