రేగొండ: వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ తండ్రిని కుమారులు చంపారు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకలో జరిగింది. రేపాకలో చేరాలు అనే వ్యక్తి ఒంటరిగా ఉంటుండగా, అతడి భార్య హైదరాబాద్లో కుమారుల వద్ద ఉంటోంది. మరో మహిళతో తండ్రి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కుమారులకు తెలిసింది. దీంతో వారు గ్రామానికి వచ్చారు. మరో మహిళతో తండ్రి ఉండగా గమనించి దాడి చేశారు. దీంతో చేరాలుతో పాటు మహిళకు తీవ్రగాయాలయ్యాయి. వారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చేరాలు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- భవన నిర్మాణ కార్మికుల కు కూటమి ప్రభుత్వ వెన్నుపోటు….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్.టి.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- ఛీ ఛీ.. నువ్వేం మనిషివిరా.. భార్యపై కోపంతో కూతురిని చంపాడు.. బైక్పై తీసుకెళ్లి..
- విశాఖలో యువతి అనుమానాస్పద మృతి… పార్టీ నుంచి లాడ్జి వరకు ఏమైంది?
- ఉద్యోగం అన్నాడు.. ప్రేయసి నుంచి రూ.18 లక్షలు కాజేశాడు.. కట్చేస్తే..
- అడుగు భూమికోసం ఇంత దారుణమా.. ఈ బుడ్డోడు ఏం చేశాడో తెలిస్తే..





