వాహనంలోని యువకుడి దుర్మరణం
వీడియో తీస్తున్న క్రమంలో అదుపుతప్పిన కారు
మేడ్చర్ల్ రూరల్ : అతివేగం, ఫోన్లో సెల్ఫీ వీడియో ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఈ ఘటన గురువారం శామీర్పేట్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. అనంతారం గ్రామానికి చెందిన మహమ్మద్ రెహాన్, మిత్రుడు ఎం.డి. అహ్మద్. వీరి స్నేహితుడు దినేష్రెడ్డి కారులో పెట్రోల్ పోయించేందుకు కొల్తూరు గ్రామానికి వెళ్లారు.
కారును దినేష్రెడ్డి నడుపుతుండగా పక్క సీటులో మహమ్మద్ రెహాన్ (18), వెనక సీటులో అహ్మద్ కూర్చున్నారు. పెట్రోల్ బంక్లో స్టాక్ లేదని తెలుసుకుని తిరిగి ఇంటికి వస్తున్నారు. దినేష్ రెడ్డి కారును వేగంగా నడుపుతూ సెల్ఫీ వీడియో తీస్తున్న క్రమంలో అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్తుండగా రెహాన్ గమనించి హ్యాండ్ బ్రేక్ను ఒక్కసారిగా లాగాడు. దీంతో కారు పల్టీలు కొట్టి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో రెహాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. దినేష్ రెడ్డి అహ్మద్ లకు గాయాలయ్యాయి.
Also read
- ఓర్నీ దుంపదెగ.. SIR వెరిఫికేషన్ పేరిట వచ్చి పుస్తెల తాడు తెంపుకుపోయిండ్రు!
- Ananthagiri Hills: అనంతగిరిలో ట్రెక్కింగ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ.. ఆ తర్వాత నిమిషాల్లోనే..
- భాగ్య, హన్నమ్మ మామూలు లేడీస్ కాదమ్మ.. బస్టాండ్లో వాళ్ల కంట పడ్డారో అంతే సంగతులు..
- కుక్కలను చంపే ఇంజెక్షన్ ఇచ్చి బావను చంపిన బావమరిది..! క్రైమ్ స్టోరీని మించిన స్కెచ్..
- ఆరు హత్యకేసుల నిందితుడు రాజ్ కుమార్ మృతి





