మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శాంతి అభిషేకాల క్రతువు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ విశేషోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలోని అలంకారం మండపంలో ఉత్సవమూర్తులకు విశేష అభిషేకాలు జరిపారు. అలంకార మండపం వద్ద ఆలయ అనువంశీక ప్రధానదీక్షా గురుకుల్ స్వామినాథన్ నేతృత్వంలో సంకల్ప పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆగమోక్తంగా జరిపారు. అలంకార మండపంలో కొలువుదీరిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత సోమస్కంద మూర్తి, శ్రీ వినాయక స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, భక్త కన్నప్ప, చండికేశ్వరుడు, దక్షిణామూర్తి తదితర ఉత్సవమూర్తులకు విశేష అలంకరణలు చేపట్టి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు.
Also read
- Garuda Purana: గరుడ పురాణం ప్రకారం అబద్ధం చెప్పే వారికి ఎలాంటి శిక్షలు పడతాయయో తెలిస్తే వెన్ను వణకాల్సిందే..
- SSC వాల్యుయేషన్లో బయటపడ్డ తీవ్ర లోపాలు.. ఐదుగురు వాల్యుయేటర్లు సస్పెండ్!
- Andhra: ఏపీ MLC కారు మిస్సింగ్.. నిందితుడ్ని పట్టేసిన పోలీసులు.. అతని చెప్పింది విని షాక్
- నడిపేది రోడ్డు సైడ్ డాబా హోటల్ అనుకునేరు.. లోపల యవ్వారం చూస్తే సీన్ సితారే
- తాగి మైకంలో రెచ్చిపోయిన కానిస్టేబుల్.. బూతులు తిడుతూ నడిరోడ్డుపై రచ్చరచ్చ!