మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శాంతి అభిషేకాల క్రతువు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ విశేషోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలోని అలంకారం మండపంలో ఉత్సవమూర్తులకు విశేష అభిషేకాలు జరిపారు. అలంకార మండపం వద్ద ఆలయ అనువంశీక ప్రధానదీక్షా గురుకుల్ స్వామినాథన్ నేతృత్వంలో సంకల్ప పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆగమోక్తంగా జరిపారు. అలంకార మండపంలో కొలువుదీరిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత సోమస్కంద మూర్తి, శ్రీ వినాయక స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, భక్త కన్నప్ప, చండికేశ్వరుడు, దక్షిణామూర్తి తదితర ఉత్సవమూర్తులకు విశేష అలంకరణలు చేపట్టి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు.
Also read
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..
- ఇన్స్టాలో పరిచమయ్యాడు.. తర్వాత ఇంటి నుంచి తీసుకెళ్లాడు.. కట్చేస్తే.. 3 నెలల తర్వాత..





