తిరువూరు (ఎన్టిఆర్ జిల్లా) : ఎన్టిఆర్ జిల్లా తిరువూరు మండల చిట్టేల టిడిపి గ్రామ సర్పంచ్ తుమ్మపల్లి శ్రీనివాసరావు భార్య, కోకిలంపాడు విఆర్ఒ కవిత బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీనిపై సర్పంచ్ శ్రీనివాసరావు విలేకర్లతో మాట్లాడుతూ తనను తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర పదజాలంతో మంగళవారం దూషించడమే కాక బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. బుధవారం తాను పొలానికి వెళ్తుంటే 20 మంది రౌడీలతో ఎమ్మెల్యే కొలికపూడి తమ గ్రామానికి వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నించగా తప్పించుకున్నానని చెప్పారు. ఈ పరిణాల నేపథ్యంలో తన భార్య మనస్తాపాన్కి గురై నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయ్నానికి పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను మెరుగైన చికిత్స కోసం విజయవాడ తీసుకెళ్లామని చెప్పారు.
Also read
- నేటి జాతకములు..27 ఏప్రిల్, 2025
- ఏపీలో పాకిస్తాన్ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది – షాకింగ్ ఫ్యాక్ట్స్!
- Pahalgam Terrorist Attack: దెబ్బ మీద దెబ్బ.. ఇక గొంతెండిపోవడమే.. ఇంత చిన్న లాజిక్ని పాకిస్తాన్ ఎలా మర్చిపోయిందబ్బా..
- లెక్చరర్ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని ఘటనలో ట్విస్ట్.. అసలేం జరిగిందో తెలుసా?
- నెల్లూరు లాడ్జిలో ప్రేమజంట ఆత్మహత్య