కోనసీమ జిల్లా అమలాపురం గ్రామీణ మండలం భట్నవిల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
అమలాపురం: కోనసీమ జిల్లా అమలాపురం గ్రామీణ మండలం భట్నవిల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ, ఆటో ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన కొల్లాబొత్తుల నవీన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకునేందుకు 8 మందితో ఆటోలో యానాం వెళ్లారు. వేడుకల అనంతరం పాశర్లపూడికి తిరిగి వస్తుండగా చేపల లోడుతో వస్తున్న లారీ, వీరి వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో కోనసీమ జిల్లా నగరం గ్రామానికి చెందిన సాపే నవీన్, కొల్లాబత్తుల జతిన్, పి.గన్నవరం మండలానికి చెందిన వల్లూరి అజయ్, మామిడికుదురు మండలం పాసర్లపూడి గ్రామానికి చెందిన నల్లి నవీన్ కుమార్ ఉన్నారు.
Also read
- ఏంతకు తెగించావురా… బంగారం కావాలంటే కొనుక్కోవాలి… లాక్కోకూడదు.
- ప్రియుడి భార్యపై HIV ఇంజెక్షన్తో దాడి.. ఆ తర్వాత సీన్ ఇదే!
- అర్ధరాత్రి వేళ ట్రావెల్స్ బస్సు బీభత్సం.. డ్రైవర్ పొట్టలోకి దిగిన వెదురు బొంగులు!
- గుంటూరులో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఆరుగురి అరెస్ట్*
- నిమ్మకాయలు.. నల్లటి ముగ్గు.. పసుపు కుంకుమలు.. ఆ ఇళ్ల ముందు రాత్రికి రాత్రే ఏం జరిగింది….





