కోనసీమ జిల్లా అమలాపురం గ్రామీణ మండలం భట్నవిల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
అమలాపురం: కోనసీమ జిల్లా అమలాపురం గ్రామీణ మండలం భట్నవిల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ, ఆటో ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన కొల్లాబొత్తుల నవీన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకునేందుకు 8 మందితో ఆటోలో యానాం వెళ్లారు. వేడుకల అనంతరం పాశర్లపూడికి తిరిగి వస్తుండగా చేపల లోడుతో వస్తున్న లారీ, వీరి వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో కోనసీమ జిల్లా నగరం గ్రామానికి చెందిన సాపే నవీన్, కొల్లాబత్తుల జతిన్, పి.గన్నవరం మండలానికి చెందిన వల్లూరి అజయ్, మామిడికుదురు మండలం పాసర్లపూడి గ్రామానికి చెందిన నల్లి నవీన్ కుమార్ ఉన్నారు.
Also read
- ఓరీ దేవుడో.. ఇదెక్కడి దారుణం.. చికెన్ ముక్క ఇరుక్కొని ఆటో డ్రైవర్ మృతి
- Telangana: నకిలీ నంబర్ ప్లేట్తో రూ. 2.5 లక్షలు చోరీ.. పోలీసులకు ఎలా చిక్కాడంటే..?
- విడు ప్రియుడు కాదు.. రాక్షసుడు.. పెళ్లికి ఒప్పుకోలేదని పట్టపగలే..
- Hyderabad: పట్టపగలు నడిరోడ్డుపై దారుణం.. వేట కత్తులతో నరికి, తుపాకీతో కాల్చి రియాల్టర్ మర్డర్
- మరో వ్యక్తితో సన్నిహితంగా కనిపించిన లవర్.. భరించలేక ప్రియుడు ఎంతకు తెగించాడంటే..





