గుంటూరు పట్టాభిపురంలో వ్యభిచార ముఠా అరెస్ట్.టాస్క్ఫోర్స్, పోలీసుల సంయుక్త దాడులు.ఒక నిర్వాహకుడితో పాటు మొత్తం ఆరుగురు అదుపులోకి .వారి నుంచి నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం
గుంటూరు పట్టాభిపురంలో ఓ వ్యభిచార ముఠా గుట్టును టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఓ ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి, మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పండరీపురం 5వ లైనులో కొంతకాలంగా ఆర్గనైజ్డ్ వ్యభిచారం జరుగుతున్నట్లు టాస్క్ఫోర్స్ సిబ్బందికి సమాచారం అందింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, టాస్క్ఫోర్స్ సిబ్బంది స్థానిక పోలీసులతో కలిసి సంయుక్తంగా ఆ ఇంటిపై మెరుపు దాడి చేశారు.
ఈ దాడుల్లో ఒక నిర్వాహకుడు, ఇద్దరు విటులతో పాటు ముగ్గురు మహిళలను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1,960 నగదు, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఆరుగురిని తదుపరి విచారణ, చట్టపరమైన చర్యల నిమిత్తం పట్టాభిపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also read
- Kumkuma : కుంకుమ కింద పడితే అశుభం కాదా?
- జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఏమవుతుంది? శుభం లేదా అశుభం.. షాకింగ్ నిజాలు!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఈ అధిక మాసంలో ఒక్క శ్లోకం చదివితే చాలు.. 33 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినంత పుణ్యంతో పాటు ఎన్నో లాభాలు!
- ఓరి దుర్మార్గుడా.. భార్యతో గొడవ వద్దన్నందుకు దాడి చేశాడు.. చివరకు





