తూర్పు గోదావరి జిల్లా మండపేటలో రేవ్ పార్టీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో సీరియస్ అయిన పోలీసులు ఇప్పటికే పదిమందిపై కేసు నమోదు చేశారు. అధికార పార్టీ నేతల అండతోనే ఆ పార్టీ జరిగిందని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపణలు చేస్తున్నారు.
ఏపీలో రేవ్ పార్టీ కల్చర్ ఆందోళనకరంగా మారింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మండపేటలో రేవ్ పార్టీ జరిగిందన్న వార్త కలకలం రేపుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ రేవ్ పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. పార్టీలో మహిళలు నగ్నంగా డ్యాన్స్ చేసినట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఇప్పటికే పది మందిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. అధికార పార్టీ అండదండలతోనే రేవ్ పార్టీ నిర్వహించాని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపించారు.
Also Read
- ఇంజనీరింగ్ సెమిస్టర్ పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేదని మనస్తాపం
- భార్యతో అడ్డంగా దొరికిన ఫ్రెండ్.. ఆ తర్వాత భర్త చేసిన పనికి అంతా బిత్తరపోయారు..
- గంగావతరణం రోజున గంగానదిలో స్నానం చేయలేకపోతున్నారా.. ఇంట్లోనే ఇలా స్నానం చేయండి..
- Jagannath Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్ర తరహాలో దేశంలో ఎక్కడెక్కడ రథయాత్ర జరుగుతుందో తెలుసా..
- నేటి జాతకములు 4 జూన్, 2025