తంగెళ్ళమూడి (ఏలూరు) : ‘మా బిడ్డను పోలీసులే చంపేశారు’ అని మరణించిన యశ్వంత్ అనే యువకుడి కుటుంబీకులు, బంధువులు ఆరోపిస్తూ … ఏలూరు జిల్లా ఆసుపత్రి వద్ద గురువారం ఆందోళన నిర్వహించారు. ఏలూరులోని తంగెళ్ళమూడి లో బంగారు యశ్వంత్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఏలూరు సిసిఎస్ పోలీసులు వల్లే తమ కుమారుడు మృతి చెందాడని ఆరోపిస్తూ జిల్లా ఆస్పత్రి వద్ద బంధువులు నిరసన చేపట్టారు. బైక్ల దొంగతనం కేసులో యశ్వంత్ ను అనుమానితుడిగా గత మూడు రోజుల క్రితం సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజుల నుంచి కాళ్లకు చేతులకు సంకెళ్లు వేసి సిసిఎస్ పోలీసులు తమ కుమారుడిని చిత్రహింసలకు గురి చేశారని బాధిత బంధువులు తెలిపారు. పోలీసులు దాడి చేయడం వల్లే తన కుమారుడు మృతి చెందాడని యువకుడి తల్లి కన్నీటిపర్యంతమయ్యింది. మూడు రోజుల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నట్లు బంధువులు తెలిపారు. యువకుడి శరీరంపై బలమైన గాయాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులే తమ బిడ్డను చంపేశారని కుటుంబీకులు, బంధువులు వాపోయారు.
Also read
- ఇదేం పనయ్యా.. ప్రభుత్వ ఉద్యోగంలో లక్షకుపైగా జీతం.. చేసేదేమో చైన్ స్నాచింగ్లు
- 5 నెలలుగా ఇంటికి తాళం.. అనుమానంతో తెరిచిన ఓనర్.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే దృశ్యం!
- ఏపీ లిక్కర్ స్కామ్లో విస్తుపోయే వాస్తవాలు.. మద్యం మాఫియా మైండ్ బ్లాక్.. రంగంలోకి ఐటీ!
- అరేయ్.. ఏంట్రా ఇది.. హుండీ లెక్కింపు ఉద్యోగాలు.. అంటూ ఉన్నది మొత్తం ఊడ్చేశాడు.. చివరకు
- చిన్న నిర్లక్ష్యం.. పెను ప్రమాదం.. బ్యాటరీ ఛార్జింగ్ పెడుతుండగా పేలుడు.. బాలుడి చేయి ఛిద్రం!





