అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనకు సంబంధించిన సంచలన సీసీ ఫుటేజ్ ఆర్టీవీ చేతికి చిక్కింది. ఓ వైన్ షాప్ దగ్గర పాస్టర్ ప్రవీణ్ కనిపించినట్లుగా సీసీ ఫుటేజ్ లో రికార్డు అయింది
అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనకు సంబంధించిన సంచలన సీసీ ఫుటేజ్ ఆర్టీవీ చేతికి చిక్కింది. ఓ వైన్ షాప్ దగ్గర పాస్టర్ ప్రవీణ్ కనిపించినట్లుగా సీసీ ఫుటేజ్ లో రికార్డు అయింది. కోదాడ, ఏలూరు మధ్యలోని ఓ వైన్ షాప్లో ఆయన మద్యం కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రవీణ్ మద్యం సేవించి బైక్ నడిపినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ప్రమాదానికి ముందే ఆయన బైక్ హెడ్ లైట్ పగిలి ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ కేసుకు సంబంధించి మరో మూడు రోజుల్లో స్పష్టత ఇస్తామని ఏలూరుల ఐజీ అశోక్ కుమార్ చెబుతున్నారు. కాగా ఇప్పటికే ఈ కేసును ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నారు. సీఎం, డీజీపీ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.
Also read
- Andhra: రిమాండ్ ఖైదీతో కలిసి టిఫిన్ చేసిన పోలీసులు.. ఆ తర్వాత సీన్ ఇదే..
- Telangana: 21 ఏళ్ల నిహారిక ఇంట్లో ఒంటరిగా ఉంది.. దూరపు బంధువునని లోపలికి వచ్చాడు.. ఆపై
- Andhra: సీబీఐ నుంచంటూ రిటైర్డ్ ఉద్యోగికి వీడియో కాల్.. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది..
- Andhra: ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 32 మందికి పైమాటే.. ఏం చెత్త పనిరా దరిద్రుడా?
- Andhra News: కాకి పెట్టిన మంట..! కాలి బూడిదైన నాలుగిళ్లు.. అసలు మ్యాటర్ తెలిస్తే..





