ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో భారీఅగ్నిప్రమాదం సంభవించింది. ఓ అపార్ట్మెంట్లోని ఆరో అంతస్తులో చెలరేగిన మంటల్లో ముగ్గురు మృతి చెందారు. వీరిలో తండ్రి, అతని ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మంటల్లో చిక్కుకున్నవారిని తరలించేందుకు అగ్నిమాపక విభాగం చర్యలు చేపట్టింది.
Delhi Dwarka Fire Accident: ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో భారీఅగ్నిప్రమాదం సంభవించింది. సెక్టార్ 13లోని షాబాద్ అపార్ట్మెంట్లోని ఏడవ అంతస్తులో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అయితే వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు.. తండ్రి, అతని ఇద్దరు పిల్లలు మరణించారు. ఈ మంటల్లో చిక్కుకున్నవారిని ఆకాశమార్గంలో తరలించేందుకు అగ్నిమాపక విభాగం చర్యలు చేపట్టింది. పలువురు ప్రాణభయంతో పైనుంచి దూకినట్లు తెలుస్తోంది.
దీనిపై ఢిల్లీ అగ్నిమాపక విభాగం పలు వివరాలు తెలిపింది. ‘‘ద్వారకలోని MRV స్కూల్ సమీపంలో ఉన్న షాబాద్ అపార్ట్మెంట్ నుండి ఉదయం 10.01 గంటలకు అగ్నిప్రమాదం గురించి డిపార్ట్మెంట్కు కాల్ వచ్చింది. మొదట్లో, ఎనిమిది అగ్నిమాపక యంత్రాలను సంఘటనా స్థలానికి తరలించాం. మంటల పరిమాణం ఎక్కువగా కనిపించడంతో, మంటలను ఆర్పేందుకు మరిన్ని అగ్నిమాపక యంత్రాలను మోహరించాం.’’ అన్నారు.
Also read
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..
- బ్లాక్ బాక్స్ ఏ రంగులో ఉంటుంది..? విమానంలో ఏ భాగంలో ఉంటుంది..? ఇది గ్రూప్1 ప్రిలిమ్స్ ప్రశ్న
- తొలిసారి భారత్లో మొదలైన బ్లాక్బాక్స్ డీకోడింగ్ ప్రక్రియ.. ఏ ఒక్క క్లూని వదలని దర్యాప్తు సంస్థలు!
- విమాన శిథిలాల్లో దొరికిన కీలక క్లూ.. DVRను విశ్లేషించనున్న FSL బృందం
- ఎయిరిండియా విమానం కూలిపోవడానికి కారణాలివేనా.? షాకింగ్ విషయాలు చెప్పిన అమెరికా నిపుణులు