పల్నాడు జిల్లా నరసరావుపేటలో పిల్లలకు గంజాయి ఇచ్చి చోరీలు చేయిస్తున్న ముఠా వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లా నరసరావుపేటలో పిల్లలకు గంజాయి ఇచ్చి చోరీలు చేయిస్తున్న ముఠా వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముఠా నుంచి రక్షించాలంటూ బాధిత కుటుంబం శనివారం పోలీసులను ఆశ్రయించింది.
నరసరావుపేట పట్టణంలోని వరవకట్టకు చెందిన షారుక్, ఫరూక్.. మైనర్లను డ్రగ్స్, గంజాయికి బానిసలు చేసి వారితో సెల్ఫోన్ దొంగతనాలు, గంజాయి రవాణా చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఓ బాలుడు రెండు నెలల క్రితం పోలీసులకు పట్టుబడి జువైనల్ హోంలో శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలయ్యాడు. బాలుడు ఇంటికి వచ్చిన తర్వాత మళ్లీ దొంగతనాలు చేయాలంటూ షారుక్, ఫరూక్ వేధిస్తున్నారు. దీంతో వారి వేధింపులు తాళలేక బాలుడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. చోరీలు చేయకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. అమయాకులైన చిన్న పిల్లలను టార్గెట్ చేసి చట్ట విరుద్ధమైన పనులు చేయిస్తున్న వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
Also read
- Andhra: రేయ్ ఏంట్రా ఇది.. ఇన్సూరెన్స్ సొమ్ము కోసం మాస్టర్ ప్లాన్.. చంపి ముక్కలు చేసి..
- Diwali 2025: దీపావళి రోజున పాత ప్రమిదల్లో దీపాలు వెలిగించడం శుభమా? అశుభమా? నియమాలు తెలుసుకోండి..
- Astro Tips: ఈ రాశుల వారు వెండి ధరించారో బతుకు బస్టాండే.. తస్మాత్ జాగ్రత్త
- నేటి జాతకములు…16 అక్టోబర్, 2025
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు