బయటపడిన పురాతన విగ్రహాలు! ఇంకా ఉన్నాయి, తవ్వకాలు జరపాలని స్థానికుల డిమాండ్
పల్నాడు జిల్లా ముప్పాళ్లలోని వీరాంజనేయస్వామి ఆలయానికి చెందిన 100 ఏళ్ల నాగేంద్ర స్వామి విగ్రహాన్ని తవ్వకాల ద్వారా గ్రామస్థులు కనుగొన్నారు. పూడిపోయిన ఆలయ స్థలంలో విగ్రహం దొరకడంతో పాటు, గొల్లభామ విగ్రహం కూడా లభించింది.
