SGSTV NEWS online
CrimeTelangana

కరెంట్ షాక్ తగిలి ఒకరి మృతి

కామారెడ్డి జిల్లా బ్యూరో ఆగష్టు : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన చిటుకుల పోచయ్య(38) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు స్థానిక ఎస్సై మల్లారెడ్డి తెలిపారు.మృతుడు పోచయ్య తన వ్యవసాయ పొలం వద్ద ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ వైర్లు సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై మృత్యున్నట్లు మృతుని భార్య పారిజాతం ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్ట్మాస్టర్ నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Also read

Related posts