SGSTV NEWS
Crime

Nellore: వృద్ధుడిని చంపి.. మృతదేహాన్ని బోరుబావిలో వేసి..



శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలంలో దారుణం చోటుచేచేసుకుంది.

లింగసముద్రం: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలంలో దారుణం చోటుచేచేసుకుంది.

ఆర్ఆర్పాలెం వద్ద నిమ్మతోటలో ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చి బోరుబావిలో పడేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లింగసముద్రంలోని జంపాలవారిపాలెం గ్రామానికి చెందిన తోపూరి నరసింహంను తన సొంత నిమ్మతోటలోనే కాపలాగా ఉంటున్న బ్రహ్మయ్య అనే వ్యక్తి హత్య చేసి బోరుబావిలో పడేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.

Also read

Related posts

Share this