నెల్లూరులోని వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీ టిడ్కో గృహాల్లో మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ అలీ అహ్మద్ అత్యాచారానికి పాల్పడ్డాడు.స్నేహితురాళ్ల ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో మైనర్ బాలిక తల్లి నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది
నెల్లూరులో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. జిల్లాలోని వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీ టిడ్కో గృహాల్లో మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ అలీ అహ్మద్ అత్యాచారానికి పాల్పడ్డాడు.స్నేహితురాళ్ల ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో మైనర్ బాలిక తల్లి నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తల్లి ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేయగా.. దీపావళి నుంచి మైనర్ బాలికపై పలు మార్లు అత్యాచారం చేసినట్లు ఆటో డ్రైవర్ అంగీకరించినట్లు సమాచారం. కాగా ఆటో డ్రైవర్ అలీ అహ్మద్ కు మూడు పెళ్లిళ్లు అయ్యాయిముగ్గురిని వదిలేసి ఒంటరిగా భగత్ సింగ్ కాలనీలో నివాసం ఉంటున్నాడు.
అలీకి భకత్ సింగ్ కాలనీలో ఒక మహిళతో వివాహేతర సంబంధం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ద్వారానే ఆ బాలికను లొంగదీసుకొని అత్యాచారం చేశాడు. బాలికను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. సీఐ అన్వర్ బాషా నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు సమాచారం.
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025