నెల్లూరులోని వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీ టిడ్కో గృహాల్లో మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ అలీ అహ్మద్ అత్యాచారానికి పాల్పడ్డాడు.స్నేహితురాళ్ల ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో మైనర్ బాలిక తల్లి నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది
నెల్లూరులో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. జిల్లాలోని వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీ టిడ్కో గృహాల్లో మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ అలీ అహ్మద్ అత్యాచారానికి పాల్పడ్డాడు.స్నేహితురాళ్ల ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో మైనర్ బాలిక తల్లి నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తల్లి ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేయగా.. దీపావళి నుంచి మైనర్ బాలికపై పలు మార్లు అత్యాచారం చేసినట్లు ఆటో డ్రైవర్ అంగీకరించినట్లు సమాచారం. కాగా ఆటో డ్రైవర్ అలీ అహ్మద్ కు మూడు పెళ్లిళ్లు అయ్యాయిముగ్గురిని వదిలేసి ఒంటరిగా భగత్ సింగ్ కాలనీలో నివాసం ఉంటున్నాడు.
అలీకి భకత్ సింగ్ కాలనీలో ఒక మహిళతో వివాహేతర సంబంధం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ద్వారానే ఆ బాలికను లొంగదీసుకొని అత్యాచారం చేశాడు. బాలికను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. సీఐ అన్వర్ బాషా నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు సమాచారం.
Also read
- గుంటూరు మిర్చి ఎంటర్టైన్మెంట్స్ వారు చిత్రీకరించిన పాట విడుదల…
- నేటి జాతకములు…17 అక్టోబర్, 2025
- Lakshmi Kataksham: శుక్ర, బుధుల మధ్య పరివర్తన.. ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం పక్కా..!
- HYD Crime: హైదరాబాద్లో దారుణం.. బాత్రూం బల్బ్లో సీసీ కెమెరా పెట్టించిన ఓనర్.. అసలేమైందంటే?
- షుగర్ ఉన్నట్లు చెప్పలేదని భార్య హత్య