తిరుపతి జిల్లా స్థానిక ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. కూరగాయల మార్కెట్లో కలికిరికి చెందిన అజమతుల్లా టమోటాల వ్యాపారం చేస్తుంటాడు. హత్యకు 1500 రూపాయల లావాదేవీలే కారణంగా అనుమానిస్తున్నారు.
AP Crime: తిరుపతి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. అయితే హత్యకు 1500 రూపాయల లావాదేవీలే కారణంగా అనుమానిస్తున్నారు. కూరగాయల మార్కెట్లో కలికిరికి చెందిన అజమతుల్లా టమోటాల వ్యాపారం చేస్తుంటాడు. మరో వ్యాపారి రుద్రతో గొడవ జరిగింది. ఆర్థిక లావాదేవీల కారణంగా గొడవ జరిగిందని చెబుతున్నారు.
1500 కోసం హత్య:
దీంతో రుద్ర తన కుమారులు, అనుచరులతో కలిసి వచ్చి అజమతుల్లాను దారుణంగా హత్య చేశాడు. ఈ హత్యతో కూరగాయల మార్కెట్లో ఉన్నవారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విచారణ పూర్తయితే అన్ని వివరాలు తెలుస్తాయని చెబుతున్నారు.
Also Read
- మరదలితో పెళ్లి జరపడం లేదనే మనస్తాపం.. పురుగుల మందు తాగిన యువకుడు..!
- Konaseema: పెంచుకున్న తల్లిదండ్రులకే పంగనామం పెట్టిన కూతురు.. ఆస్తి, డబ్బులు తీసుకుని వదిలేసింది..
- భక్తులు ఇచ్చే దక్షిణలు సరిపోక.. పవిత్ర వృత్తికే మచ్చ తెచ్చిన పూజారి.. ఏం చేశాడో తెలుసా?
- ఐపీఎస్ వై పురాన్ సూసైడ్ కేసులో కొత్త మలుపు.. దర్యాప్తులో పాల్గొన్న అధికారి ఆత్మహత్య!
- Viral: ఓర్నాయనో.. పైకి చూస్తే ఫుడ్ టిన్లు.. లోపల మాత్రం కథ వేరు.. మైండ్ బ్లాంక్ అయ్యే స్టోరీ ఇది..