SGSTV NEWS
Crime

Maoist: మావోయిస్టుల కుట్ర భగ్నం.. జర్రయితే ప్రాణం పోతుండే.


ఒకవైపు ఎదురుకాల్పుల్లో అగ్రనాయకులను కోల్పోతున్న మావోయిస్టులు భద్రతా దళాలపై కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలో మావోల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. మావోయిస్టులు అమర్చిన 10 మందుపాతరలను నిర్విర్వం చేశాయి.

Maoist : ఒకవైపు ఎదురుకాల్పుల్లో అగ్రనాయకులను కోల్పోతున్న మావోయిస్టులు భద్రతా దళాలపై కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.అందులో భాగంగా తమ కోసం వచ్చే భద్రతాదళాలను మట్టుపెట్టడానికి బాంబులు పెడుతున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. అడవి ప్రాంతంలో కూబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు 10 మందుపాతరలను అమర్చారు. అయితే వాటిని గుర్తించిన  భద్రతా బలగాలు నిర్వీర్యం చేసి.. స్వాధీనం చేసుకున్నాయి. ఆదివారం ఉదయం కోహ్కమెట పోలీస్ స్టేషన్ పరిధిలోని క్యాంప్ కుతుల్ గ్రామం ఖోడ్పర్, గుర్మ్కా అటవీ రహదారిలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఆ క్రమంలో మందుపాతరలను గుర్తించినట్లు భద్రతాబలగాలు తెలిపాయి. కాగా ఈ ప్రాంతంలో ఐఈడీలను అమర్చడంతో దరిదాపుల్లోనే మావోయిస్టులు ఉండిఉంటారని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. అందులో భాగంగా బీడీఎస్‌ బృందాలతో కలిసి ఆ పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టాయి.

మరోవైపు వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలిస్తామని ప్రధానమంత్రి మోదీతో పాటు హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. మావోయిస్టులే లక్ష్యంగా కేంద్రం ఆపరేషన్ కగార్ పేరుతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. దీంతో ఇప్పటికే వివిధ ఎన్‌కౌంటర్లలో పెద్ద ఎత్తున మావోయిస్టులు మరణించారు. అలాగే వందలాది మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. మరికొంత మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇక కేంద్రం ఇటీవల విడుదల చేసిన సమాచారాన్ని బట్టి  గతంలో కంటే మావోయిస్టుల హింస పూర్తిగా తగ్గిపోయింది. 2010లో మావోయిస్టుల హింసాత్మక సంఘటనలు 1936 ఉంటే అవి 2024 నాటికి 374కు తగ్గిపోయాయని తెలిపింది. అంటే దాదాపు 81 శాతం మేర మావోయిస్టుల హింస తగ్గిందని వివరించింది. అలాగే దేశంలో 2013లో మావోయిస్టుల ప్రభావిత జిల్లాలు 126గా ఉంటే.. అవి 2021 నాటికి 70.. ఇక ప్రస్తుత ఏడాది ఏప్రిల్ నాటికి అవి 18కి పరిమితమైనట్లు వెల్లడించింది. మావోయిస్టుల హింసలో 2010 నాటికి 720 మంది పౌరులు మరణిస్తే.. 2019కి ఆ సంఖ 150కి చేరుకుంది అది ప్రస్తుత ఏడాది మాత్రం 19 మంది మరణించారని తెలిపింది. మావోయిస్టు అగ్రనాయకులు ఎన్‌కౌంటర్లలో మరణించడంతో మావోయిస్టు కార్యకలపాలు దాదాపు తగ్గుముఖం పట్టినట్లు కేంద్రం వెల్లడించింది.

Also read

Related posts

Share this