ఐ.యఫ్.టి.యు అనుబంధ గౌతమి ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ వర్కర్స్ యూనియన్ 7 వ వార్షికోత్సవ సమావేశం నిడదవోలు పంగిడి రోడ్ లో ని విశ్రాంత ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ యూనియన్ భవనం నందు నిర్వహించడమైనది.
సమావేశం లో యూనియన్ ప్రెసిడెంట్ పామర్తి సత్యనారాయణ మాట్లాడుతూ యూనియన్ ఏడు సంవత్సరాలుగా కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తోందన్నారు .

ఐ.యఫ్.టి.యు రాష్ట్ర కమిటీ సభ్యులు ఈమని గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ కేంద్రం లో ఉన్న మోడి ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల 4 లేబర్ కోడ్ ల ను ఏప్రిల్ 1 నుండి అమలులోకి తేనున్న నేపథ్యంలో ఏప్రిల్ 1 న బ్లాక్ డే గా కార్మిక వర్గం పాటించాలని పిలుపునిచ్చారు. లేబర్ కోడ్ లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక వర్గం ఎన్ని పోరాటాలు చేసినా కేంద్రం పెడచెవిన పెట్టిందని, తాను కార్పొరేట్ ల ప్రతినిధి గానే నిలబడిందన్నారు.
పై కార్యక్రమంలో యూనియన్ నాయకులు మల్లిడి రామిరెడ్డి, షేక్ అహ్మద్ ఆలి, వెలిగట్ల శ్రీనివాస్ రావు, కోసన శివ, హుస్సేన్, కోదాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Also read
- భవన నిర్మాణ కార్మికుల కు కూటమి ప్రభుత్వ వెన్నుపోటు….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్.టి.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- ఛీ ఛీ.. నువ్వేం మనిషివిరా.. భార్యపై కోపంతో కూతురిని చంపాడు.. బైక్పై తీసుకెళ్లి..
- విశాఖలో యువతి అనుమానాస్పద మృతి… పార్టీ నుంచి లాడ్జి వరకు ఏమైంది?
- ఉద్యోగం అన్నాడు.. ప్రేయసి నుంచి రూ.18 లక్షలు కాజేశాడు.. కట్చేస్తే..
- అడుగు భూమికోసం ఇంత దారుణమా.. ఈ బుడ్డోడు ఏం చేశాడో తెలిస్తే..





