* ఏసీబీకి చిక్కిన ఎంఈవో
* రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్యండెడ్గా కూడేరు ఎంఈవో చంద్రశేఖర్
Bribe: ఏసీబీ వలకు ఓ అవినీతి చేప చిక్కింది. కూడేరు ఎంఈవో చంద్రశేఖర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్యండెడ్గా పట్టుబడ్డాడు. అనంతపురం నగరంలోని బళ్ళారి బైపాస్ రోడ్లో 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఎంఈఓ పట్టుబడ్డాడు. కూడేరు ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. గొట్కూరు సమీపంలో ఉన్న వెరీ డైన్ ఎ కాల్ ఇంటర్నేషనల్ స్కూల్ పై స్టూడెంట్ యూనియన్స్, మీడియాలో వస్తున్న వాటిపై డీఈవో దృష్టికి వెళ్లకుండా మేనేజ్ చేయడానికి స్కూల్ యాజమాన్యం నుంచి 2 లక్షల రూపాయలను ఎంఈవో డిమాండ్ చేశాడు. ఈ క్రమంలోనే పాఠశాల యాజమాన్యం ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. పాఠశాలకు చెందిన సాగర్ అనే వ్యక్తి నుంచి డబ్బులు తీసుకుంటూ అనంతపురం బైపాస్లోని ఎంజీ పెట్రోల్ బంకు వద్ద ఎంఈవో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
Also read
- నకిలీ వధూవరుల ఫొటోలతో భారీ స్కామ్.. నిధులు ఎలా స్వాహా చేశారంటే..
- అరేయ్ ఇలా ఉన్నారేంట్రా.. బైక్ దొంగల కలర్ ఫుల్ ప్లాన్.. కట్ చేస్తే, ఊరు చివర పొదల్లో..
- పోస్ట్ డెలవరీ డిప్రెషన్తో మహిళ ఆత్మహత్య? 6వ అంతస్తు నుంచి శిశువుతో దూకి..
- ఫ్రీగా బంగారాన్ని మెరిపిస్తామంటూ మాయ చేశారు! ఒంటరి మహిళను టార్గెట్ చేసి..
- నాగరాజును నమ్మింది.. నట్టేట మునిగింది.. ఏకంగా రాష్ట్రం దాటి వచ్చి..





