* ఏసీబీకి చిక్కిన ఎంఈవో
* రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్యండెడ్గా కూడేరు ఎంఈవో చంద్రశేఖర్
Bribe: ఏసీబీ వలకు ఓ అవినీతి చేప చిక్కింది. కూడేరు ఎంఈవో చంద్రశేఖర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్యండెడ్గా పట్టుబడ్డాడు. అనంతపురం నగరంలోని బళ్ళారి బైపాస్ రోడ్లో 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఎంఈఓ పట్టుబడ్డాడు. కూడేరు ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. గొట్కూరు సమీపంలో ఉన్న వెరీ డైన్ ఎ కాల్ ఇంటర్నేషనల్ స్కూల్ పై స్టూడెంట్ యూనియన్స్, మీడియాలో వస్తున్న వాటిపై డీఈవో దృష్టికి వెళ్లకుండా మేనేజ్ చేయడానికి స్కూల్ యాజమాన్యం నుంచి 2 లక్షల రూపాయలను ఎంఈవో డిమాండ్ చేశాడు. ఈ క్రమంలోనే పాఠశాల యాజమాన్యం ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. పాఠశాలకు చెందిన సాగర్ అనే వ్యక్తి నుంచి డబ్బులు తీసుకుంటూ అనంతపురం బైపాస్లోని ఎంజీ పెట్రోల్ బంకు వద్ద ఎంఈవో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
Also read
- శ్రీ కూర్మ జయంతి
- May 2026 Horoscope: వారికి పదోన్నతులు, కొత్త ఉద్యోగ అవకాశాలు.. మీ రాశి మాసఫలాలు
- ఆ ఊరి VRO మూతి పళ్ళు రాలగొట్టిన ఆకతాయిలు.. మద్యం మత్తులో బరితెగింపు
- దేవుడి దగ్గరికి వెళ్లి వస్తూ… ఏకంగా పై లోకాలకు.. ముగ్గరూ అక్కడే..
- మనుషుల మధ్య కక్ష.. బోరుకు తాళం! అల్లూరి జిల్లాలో నీటి చుక్కపై ఆధిపత్య పోరు





