ప్రకాశం జిల్లా మర్రిపూడి కొండ ప్రాంతంలో దారుణ హత్య జరిగింది. విద్యా శాఖలో పనిచేస్తున్న రాజశేఖర్ అనే వ్యక్తి మర్మాంగాలు కోసి అత్యంత కిరాతకంగా చంపారు. అనంతరం మృతదేహాన్ని మర్రిపూడి బస్టాండ్ ప్రాంతంలో పడేసి వెళ్లారు.
TG Crime: ఈ మధ్య హత్యలు జరుగుతున్న తీరు చూస్తుంటే గుండెలో గుబులు పుడుతోంది. అంతుచిక్కని రీతిలో హత్యలు చేస్తున్నారు నేరస్థులు. తాజాగా ప్రకాశం జిల్లా మర్రిపూడి కొండ ప్రాంతంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కారుతో ఈడ్చుకెళ్లి, మర్మాంగాలు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది
మర్మాంగాలు కోసి..
అయితే రాజశేఖర్ అనే వ్యక్తి ప్రకాశం జిల్లా మర్రిపూడి విద్యా శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కాగా, ఈరోజు ఉదయం రాజశేఖర్ మృతదేహం మర్రిపూడి బస్టాండ్ ప్రాంతంలో కనిపించడం కలకలం సృష్టించింది. గుర్తుతెలియని దుండగులు అతడి మర్మాంగాలను కత్తితో కోసినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు మరణానికి ముందు రాజశేఖర్ ని ఒక వాహనానికి కట్టి ఈడ్చుకెళ్లినట్లు ఆనవాళ్లు కనిపించాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్య గల కారణాలపై ఆరా తీస్తున్నారు. చేతికొచ్చిన కొడుకు దారుణ హత్యకు గురవడంతో అతడి తల్లి, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు.
Also read
- Ap Crime: మర్మాంగాలు కోసి..కారుతో ఈడ్చుకెళ్లి.. వణుకుపుట్టిస్తున్న ఒంగోలు హత్య!
- Jagan Convoy: జగన్ కాన్వయ్ ఢీకొని వృద్ధుడు మృతి
- Hyderabad : వెంటపడి ప్రేమ పెళ్లి చేసుకోని.. పిల్లలు కాకుండా టాబ్లెట్లు మింగించి!
- ఇన్నాళ్లు పెళ్లి చేయకుండా.. సొంత కూతుర్నే కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు.. కట్చేస్తే, వెలుగులోకి షాకింగ్ నిజాలు
- Telangana: ఇంట్లో బంగారం ఉందంటూ తవ్వకాలు.. కట్ చేస్తే.. అసలు ట్విస్ట్ ఇదే