విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు దిగజారి ప్రవర్తించాడు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
కాకినాడ: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు దిగజారి ప్రవర్తించాడు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో పాఠశాలకు చేరుకొని అతడికి దేహశుద్ధి. చేశారు. ఈ ఘటన కాకినాడలోని జగన్నాథపురం నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో జరిగింది.
గణితం బోధిస్తున్న శ్రీనివాసరావు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ కొందరు విద్యార్థులు తమ తల్లిదండ్రులను పాఠశాలకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో శ్రీనివాసరావు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అడ్డుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు అతడికి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఉపాధ్యాయుడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. పాఠశాలలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్పి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
Also read
- Garuda Puran: దహన సంస్కారాల తర్వాత స్మశానం నుంచి వస్తూ తిరిగి చూడడం అశుభం.. ఎందుకంటే
- Hindu Beliefs: రాత్రి గుడ్లగూబని చూడడం మంచిదేనా.. ఎటువంటి పక్షి కనిపిస్తే ఏ ఫలితం అంటే..
- Weekly Horoscope: గతం కంటే మెరుగ్గా వారి ఆర్థిక పరిస్థితి.. 12 రాశుల వారికి వారఫలాలు
- అయ్యో.. ఆసుపత్రిలో ఘోరం.. పసికందుపై ఊడిపడిన సీలింగ్ ఫ్యాన్.. ఆ తర్వాత..
- ఆ ఇళ్లే వారి టార్గెట్.. ఒకే రోజు రెండు చోరీలు.. వణికిపోతున్న స్థానికులు.. ఎక్కడో తెలుసా?