పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ డ్రైవర్ కూతురిగా తెలిసింది. జిల్లా మేజిస్ట్రేట్ డ్రైవర్ కుమార్తె కల్పిత శర్మను కొందరు గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. కల్పిత శర్మ తన తల్లితో కలిసి స్కూటీపై మార్కెట్కు వెళ్లి తిరిగి వస్తుండగా కొందరు దుండగలు బైకుపై వచ్చి యువతిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో
యూపీలోని హత్రాస్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. జూన్ 14 శనివారం రోజున ఇక్కడి సదర్ తహసీల్ ప్రాంతం సమీపంలో 24 ఏళ్ల మహిళను ఆమె తల్లి ముందే ఇద్దరు దుండగులు దారుణంగా కాల్చి చంపేశారు. మోటార్ సైకిల్ పై వచ్చిన దుండగులు ఆ యువతిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్టుగా పోలీసులు తెలిపారు.ఈ హత్య వెనుక కుటుంబ వివాదమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ డ్రైవర్ కూతురిగా తెలిసింది. జిల్లా మేజిస్ట్రేట్ డ్రైవర్ కుమార్తె కల్పిత శర్మను కొందరు గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. కల్పిత శర్మ తన తల్లితో కలిసి స్కూటీపై మార్కెట్కు వెళ్లి తిరిగి వస్తుండగా కొందరు దుండగలు బైకుపై వచ్చి యువతిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కల్పిత శర్మ మృతిచెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Also read
- హెల్మెట్ ఉన్నా దక్కని ప్రాణం.. ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం!
- మైలవరంలో విషాదం.. నదిలో మునిగి అత్త, అల్లుడు మృతి
- ఇద్దరు మహిళలతో భర్త.. చూసి పూనకంతో ఊగిపోయిన భార్య.. ఆ తర్వాత..!
- బస్సులో తెరచుకున్న అత్యవసర ద్వారం.. కిందపడి బాలికకు తీవ్రగాయాలు
- భార్య, అత్తామామల దాడి.. ఆర్మీ ఉద్యోగి మృతి





