SGSTV NEWS
CrimeUttar Pradesh

హత్రాస్‌లో దారుణం.. తల్లితో స్కూటీపై వెళ్తున్న యువతిని కాల్చి చంపిన దుండగులు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ డ్రైవర్ కూతురిగా తెలిసింది. జిల్లా మేజిస్ట్రేట్ డ్రైవర్ కుమార్తె కల్పిత శర్మను కొందరు గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. కల్పిత శర్మ తన తల్లితో కలిసి స్కూటీపై మార్కెట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా కొందరు దుండగలు బైకుపై వచ్చి యువతిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో


యూపీలోని హత్రాస్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. జూన్ 14 శనివారం రోజున ఇక్కడి సదర్ తహసీల్ ప్రాంతం సమీపంలో 24 ఏళ్ల మహిళను ఆమె తల్లి ముందే ఇద్దరు దుండగులు దారుణంగా కాల్చి చంపేశారు. మోటార్ సైకిల్ పై వచ్చిన దుండగులు ఆ యువతిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్టుగా పోలీసులు తెలిపారు.ఈ హత్య వెనుక కుటుంబ వివాదమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ డ్రైవర్ కూతురిగా తెలిసింది. జిల్లా మేజిస్ట్రేట్ డ్రైవర్ కుమార్తె కల్పిత శర్మను కొందరు గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. కల్పిత శర్మ తన తల్లితో కలిసి స్కూటీపై మార్కెట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా కొందరు దుండగలు బైకుపై వచ్చి యువతిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కల్పిత శర్మ మృతిచెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Also read

Related posts

Share this