నిడదవోలు లో స్ధానిక కాపు కళ్యాణ మంటపం వద్ద నిర్వహించిన ఐ.యఫ్.టి.యు అనుబంధ ఆదర్శ ప్లాట్ ఫారం రిక్షా వర్కర్స్ యూనియన్ సమావేశం యూనియన్ ప్రెసిడెంట్ కోనేటి మల్లేశ్వర రావు అధ్యక్షతన నిర్వహించడమైనది.
ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షులు పిచ్చా సూర్య కిరణ్, ఇఫ్టు రాష్ట్ర కమిటీ సభ్యులు ఈమని గ్రీష్మ కుమార్ లు మాట్లాడుతూ దశాబ్దాల క్రితం బ్రిటిష్ కాలం నుంచి అమలులో ఉన్న కార్మిక చట్టాలను కేంద్రం లోని మోడి ప్రభుత్వం బహుళ జాతి కంపెనీలకు అనుకూలంగా మార్చివేసిందనీ, రాతి యుగం నాటి 12 గంటల పని పునరుద్ధరించిందనీ, పాత కార్మిక చట్టాల అమలు కు మేడే స్ఫూర్తితో కార్మిక వర్గం దీక్ష పూనాలన్నారు.
పై కార్యక్రమంలో యూనియన్ నాయకులు లంకాడ గణపతి, నాగరాజు, సుబ్బారావు, సత్యనారాయణ, బాపినీడు, వీర రాఘవులు, నంగాలు తదితరులు పాల్గొన్నారు.
Also read
- సూర్య గోచారం.. 12 రాశులపై దీని ప్రభావం ఎలా ఉండనున్నదంటే?
- June Amavasya 2026: అమావాస్య నుంచి వీరికి మహర్దశ..! ఇందులో మీ రాశి ఉందా..?
- చెన్నూరు SBI గోల్డ్ చోరీ కేసు సుఖాంతం.. ఎట్టకేలకు బంగారం తిరిగి అందజేసిన బ్యాంక్
- రాత్రిళ్లు ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగ బాబు.. బాలెనో కారులో వచ్చి చోరీలు!
- 9 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. కంచర్ల శ్రీను హత్య కేసులో 13 మందికి జీవిత ఖైదు!





