నిడదవోలు లో స్ధానిక కాపు కళ్యాణ మంటపం వద్ద నిర్వహించిన ఐ.యఫ్.టి.యు అనుబంధ ఆదర్శ ప్లాట్ ఫారం రిక్షా వర్కర్స్ యూనియన్ సమావేశం యూనియన్ ప్రెసిడెంట్ కోనేటి మల్లేశ్వర రావు అధ్యక్షతన నిర్వహించడమైనది.
ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షులు పిచ్చా సూర్య కిరణ్, ఇఫ్టు రాష్ట్ర కమిటీ సభ్యులు ఈమని గ్రీష్మ కుమార్ లు మాట్లాడుతూ దశాబ్దాల క్రితం బ్రిటిష్ కాలం నుంచి అమలులో ఉన్న కార్మిక చట్టాలను కేంద్రం లోని మోడి ప్రభుత్వం బహుళ జాతి కంపెనీలకు అనుకూలంగా మార్చివేసిందనీ, రాతి యుగం నాటి 12 గంటల పని పునరుద్ధరించిందనీ, పాత కార్మిక చట్టాల అమలు కు మేడే స్ఫూర్తితో కార్మిక వర్గం దీక్ష పూనాలన్నారు.
పై కార్యక్రమంలో యూనియన్ నాయకులు లంకాడ గణపతి, నాగరాజు, సుబ్బారావు, సత్యనారాయణ, బాపినీడు, వీర రాఘవులు, నంగాలు తదితరులు పాల్గొన్నారు.
Also read
- Hanuman Jayanti: హనుమాన్ జయంతి మంగళవారమే..! ఈ రోజు ఇలా చేస్తే అఖండ ఐశ్వర్యం మీ సొంతం!
- Amavasya 2026: అమావాస్య తర్వాత వారికి అదృష్ట యోగం.. ఇందులో మీ రాశి ఉందా..?
- Hanuman Jayanti Special: ఆంజనేయుడికి తమలపాకుల ఇష్టం వెనుక కథ ఏమిటి?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఆమె రాత్రిపూట రేటు మాట్లాడుకుని పక్కనున్న పొదల్లోకి తీసుకెళ్తుంది.. కాసేపటికి..





