SGSTV NEWS online
CrimeTelangana

Wanaparthy: వివాహేతర సంబంధం మోజులో… ప్రియుడితో కలిసి భర్త హత్య


వనపర్తి : వివాహేతర సంబంధం మోజులో పడి కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి ఓ భార్య కడతేర్చిన సంఘటన వనపర్తిలో చోటుచేసుకుంది.

పట్టణంలోని గణేశ నగర్లో నివాసముంటున్న కురుమూర్తి ఒక మాల్లో వాచ్మెన్గా పని చేసేవారు. అక్టోబరు 25 నుంచి కురుమూర్తి కనిపించడం లేదని ఆయన సోదరి చెన్నమ్మ 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వనపర్తి ఎస్సై శశిధర్ కేసు నమోదు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు… కురుమూర్తి భార్య నాగమణి మెట్పల్లికి చెందిన నందిమల్ల శ్రీకాంత్ తో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ కుట్రపన్ని కురుమూర్తిని హత్య చేశారు. అనంతరం సెల్ఫ్ డ్రైవింగ్ పేరిట వనపర్తిలో కారును అద్దెకు తీసుకొని మృతదేహాన్ని తీసుకెళ్లి శ్రీశైలం డ్యాంలో పడేశారు.

చెన్నమ్మ అనుమానంతో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నాగమణి, శ్రీకాంత్లను అదుపులోకి తీసుకొని విచారణ చేయడంతో ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది.

Also read

Related posts