వనపర్తి : వివాహేతర సంబంధం మోజులో పడి కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి ఓ భార్య కడతేర్చిన సంఘటన వనపర్తిలో చోటుచేసుకుంది.
పట్టణంలోని గణేశ నగర్లో నివాసముంటున్న కురుమూర్తి ఒక మాల్లో వాచ్మెన్గా పని చేసేవారు. అక్టోబరు 25 నుంచి కురుమూర్తి కనిపించడం లేదని ఆయన సోదరి చెన్నమ్మ 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వనపర్తి ఎస్సై శశిధర్ కేసు నమోదు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు… కురుమూర్తి భార్య నాగమణి మెట్పల్లికి చెందిన నందిమల్ల శ్రీకాంత్ తో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ కుట్రపన్ని కురుమూర్తిని హత్య చేశారు. అనంతరం సెల్ఫ్ డ్రైవింగ్ పేరిట వనపర్తిలో కారును అద్దెకు తీసుకొని మృతదేహాన్ని తీసుకెళ్లి శ్రీశైలం డ్యాంలో పడేశారు.
చెన్నమ్మ అనుమానంతో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నాగమణి, శ్రీకాంత్లను అదుపులోకి తీసుకొని విచారణ చేయడంతో ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది.
Also read
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్ను కౌన్సిలింగ్కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..
- Hyderabad: కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం.. ఒక్క ఫోన్ కాల్ జీవితాలనే మార్చేసింది..!
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
- Moon Transit: చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్పాట్.. ఊహించని లాభాలు!
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!





