SGSTV NEWS
CrimeTelangana

Hyderabad : ఐదేళ్లుగా అదే పని .. బాత్రూమ్ పక్కన దాక్కుని మహిళలు స్నానం చేస్తుండగా


మహిళలు స్నానం చేస్తుండగా ఫొటోలు తీయడం, వీడియోలు రికార్డు చేస్తున్న  ఓ వ్యక్తి,ని మధురానగర్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు గత ఐదేళ్లుగా మహిళలు స్నానం చేస్తుండగా వీడియోలు, ఫొటోలు తీస్తున్నట్లుగా ఒప్పుకున్నాడు. వాటన్నిటిని తొలగించినట్టుగా వెల్లడించాడు.

మహిళలు స్నానం చేస్తుండగా ఫొటోలు తీయడం, వీడియోలు రికార్డు చేస్తున్న  ఓ వ్యక్తి,ని మధురానగర్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం… మధురానగర్‌కాలనీ కమ్యూనిటీహాల్‌లో కొన్నేళ్లుగా ఓ కుటుంబం విధులు నిర్వర్తిస్తోంది.  వారి కుమార్తె  సేల్స్‌గర్ల్‌గా పని చేస్తోంది.  డ్యూటీకి వెళ్లేందుకు సోమవారం ఉదయం స్నానం చేస్తుండగా సబ్బు కోసం బాత్ రూమ్ లో సబ్బు కోసం వెతకగా ఆమెకు అక్కడ మొబైల్‌ ఫోన్ దొరికింది. వెంటనే ఆమె బయటకు వచ్చి చూడగా కమ్యూనిటీహాల్‌లో ఎలక్ట్రిషియన్‌గా పనిచేసే వై.మరియాలి కుమార్‌ బాత్ రూమ్  కిటికీ పక్కన దాక్కుని ఉన్నాడు.

ఫోన్‌తో సహా పరార్
ఈ విషయాన్ని వివాహిత తన భర్తకు తెలియజేసింది.  అతడు అక్కడికి వచ్చి మరియాలి కుమార్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించగా అతను ఫోన్‌తో సహా పారిపోయాడు. దీంతో జరిగిన విషయాన్ని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.  పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. మరియాలి ఐదేళ్లుగా మహిళలు స్నానం చేస్తుండగా వీడియోలు, ఫొటోలు తీస్తున్నట్లుగా ఒప్పుకున్నాడు.  తాను తీసిన వీడియోలు, ఫొటోలు అన్నీ తొలగించినట్టుగా వెల్లడించాడు.  అనంతరం నిందితుడిని కాలనీ నేతలు మధురానగర్‌ పోలీసులకు అప్పగించారు

Also read

Related posts

Share this