హైదరాబాద్ కుషాయిగూడలో ఘోర మర్డర్ జరిగింది. షాపులో పనిచేసేందుకు వచ్చిన 17 ఏళ్ల బాలుడు 70 ఏళ్ల మహిళ యజమానిని దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత డెడ్ బాడీపై డ్యాన్స్ చేస్తూ తన ఫోన్లో వీడియో రికార్డ్ చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
Hyd Murder: హైదరాబాద్ కుషాయిగూడ మర్డర్ కేసు సంచలనం రేపుతోంది. ఇంట్లో పనిచేసేందుకు వచ్చిన 17 ఏళ్ల బాలుడు 70 ఏళ్ల మహిళను అత్యంత దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత డెడ్ బాడీపై డ్యాన్స్ చేస్తూ తన ఫోన్లో వీడియో రికార్డ్ చేసిన ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. అయితే సోమవారం రాత్రి బెంగళూరులోని తన బంధువుతో తాను చేసిన నేరం గురించి చెప్పిన బాలుడు.. వీడియోను షేర్ చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఇనుప రాడుతో కొట్టి కొట్టి..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు రాజస్థాన్కు చెందిన కమలా దేవి (70) గత 30 ఏళ్ల క్రితం తన భర్తతో కలిసి జీవనోపాధి కోసం హైదరాబాద్కు వలస వచ్చింది. కమలా భర్త 15 సంవత్సరాల క్రితం చనిపోయారు. దీంతో ఆమె కృష్ణ నగర్లోని 5వ వీధిలో ఉండే తమ ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. అయితే తన భర్త నడిపించిన దుకాణాలు ఇప్పుడు అద్దెకు ఇవ్వడంతో నెలకు దాదాపు 50 వేల రూపాయలు వస్తుంది. ఈ క్రమంలోనే ఆమె రోజువారీ పనుల కోసం దుకాణాలలో పనిచేసే కార్మికుల నుంచి సహాయం తీసుకునేది. ఇటీవల ఒక దుకాణంలో పనిచేసే 17 ఏళ్ల కార్మికుడితో గొడవ జరిగింది. దీంతో కమలపై పగ పెంచుకున్న 17 ఏళ్ల పిల్లవాడు ఏప్రిల్ 11న రాత్రి కమల ఇంటికి వెళ్లి 11.30 గంటలకు ఆమె తలపై ఇనుప రాడ్ తో దాడి చేసి హతమార్చాడు.
సీలింగ్ ఫ్యాన్ కు వేలాడదీసి..
ఆ తర్వాత చీరను ఆమెను గొంతుకు చుట్టి సీలింగ్ ఫ్యాన్ కు వేలాడదీశాడు. ఆమె శరీరం సగభాగం మంచంమీద ఉంచి మృదేహంపై డ్యాన్స్ చేస్తూ సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. అనంతరం ఇంటికి తాళం వేసి పారిపోయాడు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 13న బెంగళూరులో నివసించే బాధితురాలి బంధువుకు నిందితుడు స్వయంగా ఫోన్ చేసి చెప్పడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడి హత్య వాదనలను ముందుగా ఆ బంధువు నమ్మలేదు. నిందితుడు అతను శరీరంపై నృత్యం చేస్తున్న వీడియోను షేర్ చేశాడంతో ఉలిక్కిపడ్డాడు
ఏప్రిల్ 14న కుషాయిగూడలోని పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వెంటనే ఇంటికి వెళ్లి చూడగా ఇంటి నుండి దుర్వాసన వచ్చింది. మా బృందం తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించగా కుళ్ళిపోయిన మృతదేహం కనిపించింది. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించామని కుషాయిగూడ ఇన్స్పెక్టర్ ఎల్. భాస్కర్ రెడ్డి తెలిపారు. హత్య కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read
- నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే
- Viral News: చెప్తే అర్థం చేసుకుంటారనుకుంది.. తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు..
- Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
- Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
- Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది





