యూపీలోని సంభాల్లో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. భార్య, భర్తల మధ్య గొడవకు బావమరిది కారణమయ్యాడు. దీంతో భర్త ప్రైవేట్ పార్ట్ను భార్య కత్తితో కట్ చేసేసింది. అనంతరం అతడి నాలుకను నోటితో కొరికేసింది. కేకలు విన్న పొరుగువారు అతడిని హాస్పిటల్లో చేర్చారు.
ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. భార్య, భర్తల మధ్య గొడవకు బావమరిది కారణమయ్యాడు. దీంతో భార్య చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. దంపతులిద్దరూ గొడవ పడగా.. భర్త ప్రైవేట్ పార్ట్ను కత్తితో భార్య కట్ చేసేసింది. అక్కడితో ఆగకుండా అతడి నాలుకను సైతం తన నోటితో కొరికేసింది. అస్మోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో జరిగిన ఈ ఘటన నెట్టింట వైరల్గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.
భర్త ప్రైవేట్ పార్ట్ కోసేసిన భర్య
యూపీలోని సంభాల్ జిల్లా అస్మోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో దంపతులు నివశిస్తున్నారు. భర్త తన భార్య సోదరుడితో ఫోన్లో మాట్లాడటానికి పదే పదే నిరాకరించాడు. ఇదే విషయంపై భార్య, భర్తల మధ్య గొడవ చెలరేగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భార్య తన భర్తపై దాడికి దిగింది. ఏకంగా భర్త ప్రైవేట్ పార్ట్ను కొసేసింది. అక్కడితో ఆగకుండా అతడి నాలును సైతం తన నోటితో కొరికేసింది.
తీవ్ర గాయాలతో అతడు గట్టిగా అరవడంతో పొరుగువారు ఇంట్లోకి వచ్చి దాడిని ఆపారు. అదే సమయంలో ఆ మహిళ కూడా అనుమానాస్పద స్థితిల్లో యాసిడ్ తాగి పడిపోయింది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మొరాదాబాద్లోని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై బాధితుడు మాట్లాడుతూ.. తన భార్య తనను చంపాలనుకుందని, కానీ పొరుగువారు తనను కాపాడారని చెప్పాడు
ఇక ఈ దాడి సమయంలో కేకలు విని ఇరుగుపొరుగు వారు వచ్చారని, లేకుంటే తన భార్య తనను చంపేసేదని బాధితుడు తెలిపాడు. ఎందుకంటే ఆమె చేతిలో అప్పటికే కత్తి ఉందని, దానితో ఆమె తన ప్రైవేట్ పార్ట్ కోసిందని, ఆమె నోటితో తన కాలును కొరికిందని.. ఆ తర్వాత తాను స్పృహ కోల్పోయాను అని చెప్పాడు. మరోవైపు ఆ మహిళ సోదరుడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. కట్నం డిమాండ్ను తీర్చలేదని, తన సోదరిని కొట్టి బలవంతంగా యాసిడ్ తాగించాడని ఆమె భర్తతో సహా ఐదుగురిపై కేసు నమోదు చేశాడు
Also read
- Tragedy in Visakhapatnam: విశాఖలో పండగపూట విషాదం.. బీటెక్ విద్యార్థి మృతి
- బొగ్గుల శ్రీనివాస్ మరణం వెనుక మిస్టరీ.. పాలేరు జలాశయంలో కారు ప్రమాదం.. హత్యనా? ఆత్మహత్యనా?
- Andhra News: అయ్యో ఏం జరిగిందో పాపం.. హాస్టల్ వాష్రూమ్లో విగతజీవిగా కనిపించిన విద్యార్థి!
- మహాశివరాత్రి కథ.. శివపార్వతుల కళ్యాణం నేటి ఆధునిక జీవితానికి ఓ ఆధ్యాత్మిక గాథ
- నేటి జాతకములు 16 ఫిబ్రవరి, 2026





