April 18, 2025
SGSTV NEWS
Telangana

ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవం చేసుకుంటే నొప్పి ఉండదా? గవర్నమెంట్ ఆసుపత్రిలోనే నొప్పి వస్తుందా?

ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవం చేసుకుంటే నొప్పి ఉండదా? గవర్నమెంట్ ఆసుపత్రిలోనే నొప్పి వస్తుందా?

“సినిమాలు ఎక్కువగా చూస్తావా? డైలాగులు చెప్తున్నావా?” అంటూ గర్భిణీ స్త్రీపై హేళన చేస్తూ మానసికంగా వేధించిన వైద్యులు.

భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు ప్రసవ సేవలు అందించకుండా అవాంతరాలు సృష్టిస్తున్న వైద్యులు.

ప్రసవ సేవల కోసం లంచం డిమాండ్ చేస్తున్న ఆసుపత్రి సిబ్బంది.

పురిటి నొప్పులతో బాధపడుతున్నామంటూ వేడుకున్నా కనికరం చూపని వైద్యులు.

“నొప్పి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వస్తుందా? అంత భయంగా ఉందా? అయితే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లు!” అంటూ గర్భిణులను అవమానించిన వైద్యులు.

బిడ్డ బయటకు వస్తున్న వేళ నొప్పిని భరించలేక బాధపడుతున్న గర్భిణీని, “మొదటి కాన్పు ప్రైవేట్ ఆసుపత్రిలో చేసుకున్నావా? అక్కడ నొప్పి రాలేదా? సినిమాలు ఎక్కువగా చూస్తావా? డైలాగులు చెప్తున్నావు!” అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించిన వైద్యురాలు ప్రమీలారాణి.

ప్రసవం పూర్తయ్యాక శిశువును పక్కన పడేసి, తల్లిని పట్టించుకోని వైద్యులు. రిజిస్టర్‌లో పేర్లు తప్పుగా నమోదు చేయడంతో, సవరించమంటే లంచం అడుగుతున్నారని, రోగులకు తాగునీరు కూడా సరిగ్గా అందుబాటులో లేదని ఆవేదన వ్యక్తం చేసిన బాలింత.

Also read

Related posts

Share via