అనారోగ్యంతో పోరాడుతూనే ఇంటర్ పరీక్షలు రాశాడు
671 మార్కులతో పాసయ్యాడు
మృత్యువుతో పోరాడి అలసిపోయాడు
హైదరాబాద్: అనారోగ్యంతో పోరాడుతూనే ఇంటర్ పరీక్షలు రాశాడు.. భవిష్యత్తు బాగుండాలని అందరిలానే కలలు కన్నాడు.. బుధవారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో పస్ట్క్లాస్ మార్కులతో పాసయ్యాడు.. కానీ తన రిజల్ట్స్ చూసుకోకుండానే విధి వక్రీకరించడంతో సదరు బాలుడు మృతిచెందాడు.. వివరాల్లోకెళితే గాజులరామారం డివిజన్ రోడామేస్త్రీనగర్కు చెందిన మీర్జా నయీమ్బేగ్, అస్రాబేగంలకు కుమారుడు మీర్జా హంజాబేగ్(17) ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
అయినా పట్టుదలతో చదివి 10వ తరగతి పరీక్షల్లో పస్ట్క్లాస్లో పాసయ్యాడు. అనంతరం ఇంట్లోనే విశ్రాంతి తీసుకోమ్మని తల్లిదండ్రులు కోరినా చదవాలనే కోరికతో ఐడీపీఎల్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్లో అడ్మిషన్ తీసుకున్నాడు. మార్చి 2024లో అనారోగ్యంతో పోరాడుతూనే ఇంటర్ పరీక్షలు రాశాడు. ఆరోగ్యం క్షీణించడంతో అస్పత్రిలో చేరిన హంజాబేగ్ చికిత్స పొందుతూ మార్చి 27న మృతి చెందాడు. బుధ వారం ఇంటర్ ఫలితాలు చూసిన తల్లిదండ్రు లు తమ కుమారుడు 671మార్కులతో పాసయ్యాడని తెలుసుకుని బోరున విలపించారు.
Also read
- ఓరి దుర్మార్గుడా.. భార్యతో గొడవ వద్దన్నందుకు దాడి చేశాడు.. చివరకు
- అయ్యో దేవుడా.. కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో నర్సింగ్ ఆఫీసర్ మృతి.. ఎప్పుడూ ఇలాంటి తప్పు చేయొద్దు
- ఫ్రీగా ఇంటికి డెలివరీ అయిన ఫోన్.. సిమ్ వేసి కొంతసేపు వాడాక ట్విస్ట్..
- తోడ పుట్టడమే ఆమె చేసిన పాపమా.. సొంత అన్నే కాలయముడై ఏం చేశాడంటే?
- ఆస్తి కోసం బంధువుల బరితెగింపు.. తల్లీకుమార్తెల దారుణ హత్య!





