గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని ఓ రైసు మిల్లు బంకర్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 12 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఫిరంగిపురం : గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని ఓ రైసు మిల్లు బంకర్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 12 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పౌర సరఫరాలశాఖ అధికారి దేవరాజ్, తహసీల్దారు ప్రసాదరావు తెలిపిన వివరాల మేరకు.. ఫిరంగిపురంలోని రాఘవేంద్ర రైసు మిల్లులో ఆదివారం సోదాలు నిర్వహించారు. మిల్లులో బంకర్లు ఉండగా ఒక దానిలో బియ్యం నిల్వ చేసినట్లు గుర్తించారు. అది రేషన్ బియ్యంగా నిర్ధారణ కావడంతో యాజమాన్యాన్ని ఆరా తీశారు. ఎలాంటి అనుమతులూ లేవని చెప్పడంతో మొత్తం 12 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
Also Read
- నిజ జీవితంలో ‘నాన్న పులి కథ’.. భర్త కళ్ల ముందే భార్య మృతి. సరిగా ఉరివేసుకో అనడంతో..
- తీవ్ర విషాదం.. భర్త మీద కోపంతో.. ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకేసిన మహిళ..!
- బామ్మర్ది పెళ్లి.. బావ బలవన్మరణం
- ఉద్యోగం వస్తే ఇలా చేయాల్నా.. భర్తను కేసులతో హింసించిన భార్య.. పాపం చివరకు
- ఇద్దరు ప్రియురాళ్లను తీసుకుని వెళ్లి, దావత్ చేసుకున్న ప్రియుడు.. ఇంతలోనే షాకింగ్ ఘటన..!





