కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా 19:
వాంకిడి మండలం తేజపూర్ గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది వివరాల్లోకెళితే ఈ సందర్భంగా గ్రామ పటేల్ సెండే శంకర్, మాజీ ఎంపీటీసీ సోమేశ్వర్ గ్రామస్థులు మాట్లాడుతూ వాంకిడి మండలం తేజపూర్ గ్రామానికి చెందిన నిరుపేద రైతు ఐనటువంటి మొహార్లే ధర్మయ్య గతరోజు 15/౦1/2024 న సంతోషంగా ప్రతి సంవత్సరం లాగా పుట్టపర్తి సాయి దర్శనానికి వెళ్తూ రైల్వేస్టేషన్ హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లో దిగి కాచిగూడ ఎక్కంగ్గానే ప్రమాదవశాత్తు క్రింద పడి తలకు తీవ్రమైన గాయాలయ్యాయని హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతున్న ఆయన మంగళవారం ఇక ప్రాణాలతో లేడని తెలిసిందని మరణించడం జరిగిందన్నారు మృతునికి భార్య మమత (22) ఇద్దరు చిన్న పిల్లలు పాప వర్శిత, బాబు ప్రవీణ్ ఆరు నెలలు, మూడు నెలల చిన్నపిల్లలు సంతానం ఉన్నారని నిరుపేద కుటుంబం అని కుటుంబ పెద్ద మృతి చెందడంతో కుటుంబం ఇంటిపెద్ద లేని అనాధ అయిందని తెలిపారు.


బాధిత కుటుంబానికి తక్షణమే రైల్వేశాఖ గాని ప్రభుత్వం గాని ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ వెంకటేష్, ఎమ్మెల్యే కోవాలక్ష్మి ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయి ఆర్థికసాయం అందించాలని పేర్కొన్నారు విన్నవించారు.భార్య మమత భర్త లేడని ఇక రాడని మృతదేహం మీద పడి రోధించడం అందరినీ కలచివేసింది.
Also read
- నేటి జాతకములు…14 మే, 2025
- Surya Transit: ఈ నెల 15 రాశిని మార్చుకోనున్న సూర్యుడు.. ఈ 4 రాశులవారిపై ప్రతికూల ప్రభావం.. అనుగ్రహం కోసం ఏమి చేయాలంటే..
- Weekly Worship Guide: వారంలో 7 రోజులు.. ఏ రోజు ఏ దేవుడిని పూజించడం మంచిదో తెలుసా..
- Lord Shani: శని దోషంతో ఇబ్బంది పడుతున్నారా.. శనీశ్వర అనుగ్రహం కోసం ఈ పరిహారాలు చేసి చూడండి..
- ‘ఒక్కసారి రూమ్కు రా’.. నమ్మి వచ్చిన స్నేహితురాలిని తాగించి రేప్!