కర్నూలు టౌన్: తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. ఈ ఘటన గురువారం కర్నూలు జిల్లా సంతోష్నగర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్నగర్కు చెందిన లక్ష్మీదేవి ఇంటికి తాళం వేసి తన కుమార్తెతో పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. పనులు ముగించుకొని ఇంటికి తిరిగి రాగా తాళం పగులగొట్టి ఉంది. గమనించిన తల్లీకుమార్తె ఇంట్లోకి వెళ్లగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వారిని తోసేసి పరారయ్యారు. ఈ క్రమంలో లక్ష్మీదేవికి గాయాలయ్యాయి. 14 తులాల బంగారం చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటనపై నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- మానవత్వం మరిచిన ఇంటి యజమాని.. మృతదేహాలను ఇంట్లోకి రానివ్వకుండా గేటుకు తాళం
- సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం.. సీఐ నాగరాజు అరెస్ట్!
- అమానవీయం.. మృతదేహాలు తీసుకురాకుండా అద్దె ఇంటికి తాళం
- రోడ్డు దాటుతుండగా విషాదం..!
- ఆర్థిక ఇబ్బందులతో వివాహిత ఆత్మహత్య






ఊడదీయడానికి అరటి తొక్క కాదు.. జగన్ కు ఎస్ఐ వార్నింగ్