సెల్ఫోన్ పేలి 11 ఏళ్ల బాలికకు తీవ్రగాయాలైన ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం ఎమ్మాజీగూడెంలో చోటు చేసుకుంది.
బెల్లంకొండ, న్యూస్టుడే: సెల్ఫోన్ పేలి 11 ఏళ్ల బాలికకు తీవ్రగాయాలైన ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం ఎమ్మాజీగూడెంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. కుంచాల వెంకటేశ్వరరావు కుమార్తె వీరలక్ష్మి అయిదో తరగతి చదువుతోంది. శనివారం ఇంట్లో సెల్ఫోన్ ఛార్జింగ్ పెట్టి వీడియోలు చూస్తుండగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ప్రమాదంలో బాలిక కుడిచేతి రెండు వేళ్లు పూర్తిగా తెగిపోయాయి. పొట్ట భాగంలో గాయాలయ్యాయి. వెంటనే గుంటూరు వైద్యశాలకు తరలించారు.
Also read
- నిశ్చితార్థం అయ్యాక పెళ్లి చేసుకోనన్న యువకుడు
- అప్పుల బాధతో ముగ్గురు పిల్లలతో కలిసిబావిలోకి దూకిన తల్లి
- హత్య చేసి.. పక్కింటి దూలానికి వేలాడదీసి!
- భర్తకు రెండో పెళ్లి మాటలతో వేధింపులు?.. టీచర్ ఆత్మహత్య
- Pilgrimage: పుణ్యక్షేత్రాల దర్శనం ఎందుకు చేయాలి..? ఎవరు చేయాలి..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి





