సంగారెడ్డి జిల్లా మెగ్యా నాయక్ తండాలో దారుణం చోటుచేసుకుంది. గోపాల్ అనే వ్యక్తి రామచందర్ తండాకు చెందిన దశరథ్ తన కూతురితో చనువుగా ఉంటున్నాడని చంపేశాడు. నిజాంపేట శివారులోని అడవిలోకి తీసుకెళ్లి చంపేసి ఆపై దశరథ్ శవాన్ని తగలపెట్టాడు.
Sangareddy crime: 9వ తరగతి చదువుకుంటున్న తన కూతురితో చనువుగా ఉంటున్నాడని ఓ వ్యక్తిని చంపి తలబెట్టాడు ఆ బాలిక తండ్రి. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా మెగ్యా నాయక్ తండాలో చోటుచేసుకుంది. అసలు వివరాల్లోకి వెళితే..
చంపి.. తలబెట్టి..
మెగ్యా నాయక్ తండాకు చెందిన గోపాల్ అనే వ్యక్తికి 9వ తరగతి చదువుతున్న కూతురు ఉంది. అయితే రామచందర్ తండాకు చెందిన దశరథ్ అనే వ్యక్తి తన కూతురితో చనువుగా ఉండడం కొద్దిరోజులుగా గమనిస్తున్నాడు గోపాల్. అదే కోపంతో ఒకరోజు ఎవరికీ తెలియకుండా దశరథ్ ను నిజాంపేట శివారులోని అడవుల్లోకి తీసుకెళ్లిన గోపాల్ అతడిని దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని తగులబెట్టాడు.
అయితే నాలుగు రోజులుగా భర్త దశరథ్ కనిపించకుండా పోవడంతో అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అసలు విషయం బయటపడింది. నిందితుడు గోపాల్ తానే స్వయంగా నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. దశరథ్ మృతదేహం కోసం భార్య, అతని కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించారు. మృతుడు దశరథ్కు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Also read
- మహిళ ఏకాంత ఫొటోలతో బ్లాక్మెయిల్.. లైంగికదాడికి పాల్పడ్డ జూబ్లీహిల్స్ సీఐపై కేసు!
- ఎంత పనిచేశావ్ పెద్దాయన.. భార్య మందలిస్తే చనిపోవాలా?
- పాపం ప్రియాంక.. ఆఖరి ప్రయత్నంగా అప్నియా టెస్ట్.. రాజమండ్రి మెడికో హెల్త్ అప్డేట్ ఇదే..
- గదిలోకి మాస్క్ లేకుండా రావొద్దు.. హీలియం గ్యాస్ పీల్చుకుని చార్టర్డ్ అకౌంటెంట్ సూసైడ్..
- అందగా ఉంటుందని.. అమాయకరాలు అనుకునేరు..! విశాఖ రాథోడ్ మామూల్ది కాదు..





