సంగారెడ్డి జిల్లా మెగ్యా నాయక్ తండాలో దారుణం చోటుచేసుకుంది. గోపాల్ అనే వ్యక్తి రామచందర్ తండాకు చెందిన దశరథ్ తన కూతురితో చనువుగా ఉంటున్నాడని చంపేశాడు. నిజాంపేట శివారులోని అడవిలోకి తీసుకెళ్లి చంపేసి ఆపై దశరథ్ శవాన్ని తగలపెట్టాడు.
Sangareddy crime: 9వ తరగతి చదువుకుంటున్న తన కూతురితో చనువుగా ఉంటున్నాడని ఓ వ్యక్తిని చంపి తలబెట్టాడు ఆ బాలిక తండ్రి. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా మెగ్యా నాయక్ తండాలో చోటుచేసుకుంది. అసలు వివరాల్లోకి వెళితే..
చంపి.. తలబెట్టి..
మెగ్యా నాయక్ తండాకు చెందిన గోపాల్ అనే వ్యక్తికి 9వ తరగతి చదువుతున్న కూతురు ఉంది. అయితే రామచందర్ తండాకు చెందిన దశరథ్ అనే వ్యక్తి తన కూతురితో చనువుగా ఉండడం కొద్దిరోజులుగా గమనిస్తున్నాడు గోపాల్. అదే కోపంతో ఒకరోజు ఎవరికీ తెలియకుండా దశరథ్ ను నిజాంపేట శివారులోని అడవుల్లోకి తీసుకెళ్లిన గోపాల్ అతడిని దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని తగులబెట్టాడు.
అయితే నాలుగు రోజులుగా భర్త దశరథ్ కనిపించకుండా పోవడంతో అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అసలు విషయం బయటపడింది. నిందితుడు గోపాల్ తానే స్వయంగా నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. దశరథ్ మృతదేహం కోసం భార్య, అతని కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించారు. మృతుడు దశరథ్కు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Also read
- ఇంట్లోంచి రూ.20 తెచ్చి.. ఢిల్లీ చూపిస్తానంటూ..! ముగ్గురు విద్యార్థుల మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్
- క్యాష్ వ్యాన్లో సినిమా ట్విస్ట్.. రూ.17 లక్షలతో డ్రైవర్ మాయం.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- ఫ్యాక్షన్ సినిమాను మించిన ట్విస్ట్లు.. ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులుగా ఎలా మారారో తెలిస్తే..
- మనవడే యముడయ్యాడు.. బైక్ కొనేందుకు నగలు ఇవ్వలేదని.. ఫ్రెండ్తో కలిసి..
- ప్రణవి ప్రాణం తీసిన ఫోన్..! పిట్ట గోడపై కూర్చొని మాట్లాడుతుండగా ఒక్కసారిగా..





