March 15, 2025
SGSTV NEWS
CrimeNational

విద్యార్థుల మధ్య ఫేర్‌వెల్ పార్టీ చిచ్చు.. ఒకరు మృతి


కేరళలోని కోజికోడ్‌లో ఓ స్కూల్‌లో ఫేర్‌వెల్ పార్టీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెండు గ్రూపుల విద్యార్థులు మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో ఓ పదవ తరగతి విద్యార్థి ఇతర విద్యార్థులపై దాడి చేయడంతో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

కేరళలోని కోజికోడ్‌లో విద్యార్థుల మధ్య సంఘర్షణ  ఒకరి ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని కోజికోడ్ జిల్లాలోని ఎలెట్టిల్‌లోని ఎంజె హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ఫేర్‌వెల్ పార్టీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెండు గ్రూపుల విద్యార్థులు మధ్య ఘర్షణ చెలరేగింది. ఓ పదవ తరగతి విద్యార్థి ఇతర విద్యార్థులపై దాడి చేశాడు

విద్యార్థిపై దాడి చేయడంతో..
దీంతో ఓ విద్యార్థి తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆ విద్యార్థిని కోజికోడ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ విద్యార్థి మరణించాడు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడి చేసిన ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది

Also read

Related posts

Share via