ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇందుకోసం పవన్, ఆద్యతో పాటు చిన్న కూతురు పలీనా అంజలి కొణిదెల ఇప్పటికే తిరుమల చేరుకున్నారు. అయితే పలీనా క్రిస్టియన్ కావడంతో తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చింది
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇందుకోసం పవన్, ఆద్యతో పాటు చిన్న కూతురు పలీనా అంజలి కొణిదెల ఇప్పటికే తిరుమల చేరుకున్నారు. అయితే పలీనా క్రిస్టియన్ కావడంతో తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చింది. ఈ మేరకు టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై పవన్ కూతురు సంతకం చేసింది. పలీనా అంజని మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా ఇటీవల మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన సందర్భంగా డిక్లరేషన్ వివాదం నెలకొంది. హిందూ యేతరులు డిక్లరేషన్ పై సంతకం చేశాకే శ్రీవారి దర్శనానికి అనుమతివ్వాలంటూ కూటమి పార్టీలతో పాటు హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే ఆ తర్వాత జగన్ తిరుమల పర్యటన అనూహ్యంగా రద్దయ్యింది. ఈ వివాదం నడుస్తోన్న వేళ పవన్ కల్యాణ్ తన కూతురితో డిక్లరేషన్ పై సంతకం చేయించడం, తండ్రిగా తానూ సంతకం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తిరుమలలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేస్తోన్న
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉపయోగించారన్న ఆరోపణల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీక్ష ముగింపు కోసం ఆయన తిరుమలకు చేరుకున్నారు. ఇవాళ శ్రీవారిని దర్శించుకుని, ఆ తర్వాత దీక్ష విరమించనున్నారు.
కాగా సుమారు రెండు రోజుల పాటు తిరుమ కొండపైనే పవన్ బస చేయనున్నారని తెలుస్తోంది. శ్రీవారి సన్నిధిలో ప్రాయశ్చిత్త దీక్ష విరమించి అన్న ప్రసాదం, లడ్డూ తయారీ ప్రక్రియలను పరిశీలించనున్నారు. ఆ తర్వాత తిరుపతిలో వారాహి సభ నిర్వహించనున్నారు.
Also read
- DNA test: దివ్యాంగ సోదరిపై అత్యాచారం.. నాలుగేళ్లకు ‘డీఎన్ఏ’ పరీక్షలో దొరికిపోయి!
- ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య
- నువ్వు చాలా అందంగా ఉన్నావు…. తక్కువ వయస్సులా కనిపిస్తున్నావు..
- మాజీ ప్రియురాలిపై రౌడీ షీటర్ లడ్డూ దాడి
- బాత్రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్ ట్విస్ట్