తిరుపతి – చెన్నై హైవే ఎస్వీపురం అంజేరమ్మ కనుమ సమీపంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంలో మంటలు లేచి పూర్తిగా దగ్ధమైంది.
వడమాలపేట, : తిరుపతి చెన్నై హైవే ఎస్వీపురం అంజేరమ్మ కనుమ సమీపంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంలో మంటలు లేచి పూర్తిగా దగ్ధమైంది. వడమాలపేట మండలం పాపరాస కండ్రిగకు చెందిన శివ ఆర్నెల్ల క్రితం వాహనాన్ని కొన్నారు. గురువారం దానిపై పుత్తూరు వెళ్లి వస్తుండగా అంజేరమ్మ కనుమ సమీపంలో వాహనం నుంచి పొగ వచ్చింది. అప్రమత్తమై వాహనాన్ని నిలిపి, దానికి దూరం జరగ్గా కొద్దిసేపటికి మంటలు చెలరేగి కాలి బూడిదైంది.
Also read
- కూకట్పల్లిలో స్పా ముసుగులో వ్యభిచారం బట్టబయలు
- నిశ్చితార్థం అయ్యాక పెళ్లి చేసుకోనన్న యువకుడు
- అప్పుల బాధతో ముగ్గురు పిల్లలతో కలిసిబావిలోకి దూకిన తల్లి
- హత్య చేసి.. పక్కింటి దూలానికి వేలాడదీసి!
- భర్తకు రెండో పెళ్లి మాటలతో వేధింపులు?.. టీచర్ ఆత్మహత్య





