విశాఖ జిల్లా పద్మనాభం మండలం తునిపొలం గెడ్డలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తండ్రికి సాయం చేసేందుకు వెళ్లిన కూతురు గల్లంతు అయ్యింది. కాలుజారి ప్రమాదవశాత్తు గడ్డలో జారీపడిన బాలిక ధనుశ్రీ మునిగిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు రెవిన్యూ సిబ్బంది సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ధనుశ్రీ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.
విశాఖ జిల్లా పద్మనాభం మండలం తునిపొలం గ్రామంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు గెడ్డలో జారిపడిన 13 ఏళ్ల బాలిక గల్లంతైన ఘటన గురువారం (అక్టోబర్ 30) చోటు చేసుకుంది. కాళ్ల ధనుశ్రీ (13) తల్లి గౌరి, తండ్రి శ్రీనుతో కలిసి బట్టలు ఉతికేందుకు గెడ్డకు వెళ్లింది. ఆ సమయంలో పొరపాటున కాలుజారి గెడ్డలోకి కొట్టుకుపోయిందని తల్లి గౌరి తెలిపారు. దీంతో ధనుశ్రీ ఆచూకీ కోసం గ్రామస్తులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గెడ్డలో గాలింపు చర్యలు చేపట్టారు
Also read
- భార్య కోసం.. రేడియో టవర్ ఎక్కిన యువకుడు
- అక్క అస్థిపంజరంతో బ్యాంకుకు.. ఒడిశాలో ఓ వ్యక్తి ఎంత అసహనానికి గురయ్యాడంటే..
- Telangana: ఇంతకాలం టైంపాస్కి లవ్ చేశావా..? అమ్మాయి చెప్పిన ఆ ఒక్క మాటతో..
- మామిళ్ళగూడెం మృత్యుఘోష.. నిన్న తండ్రి, కూతురు.. నేడు తల్లి.. ఆ ఇంట్లో ఏం జరిగింది?
- స్క్రీన్ ప్లే అదిరింది కానీ.. సీన్ మార్చేసిన క్యూఆర్ కోడ్! చండ్రుపట్ల కాలువ మృతదేహం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!





