నగరంలో డేటింగ్ స్కాం వెలుగులోకి వచ్చింది. డేటింగ్ యాప్ లో పరిచయమవుతున్న యువతులు.. యువకులను హైటెక్ సిటీలో ఓ పబ్కి తీసుకెళ్తున్నారు.
హైదరాబాద్: నగరంలో డేటింగ్ స్కాం వెలుగులోకి వచ్చింది. డేటింగ్ యాప్లో పరిచయమవుతున్న యువతులు.. యువకులను హైటెక్ సిటీలోని ఓ పబ్కి తీసుకెళ్తున్నారు. అక్కడ ఖరీదైన మద్యం, ఇతర ఆహార పదార్థాలు ఆర్డర్ చేసి యువతులు జారుకుంటున్నారు. ఇప్పటి వరకూ 8 మంది బాధితులుగా మారినట్లు తెలుస్తోంది.
టిండర్, బంబుల్ వంటి డేటింగ్ యాప్లో పరిచయం అవుతున్న యువతులు.. వెంటనే వాట్సాప్ ద్వారా కలుద్దామని సందేశాలు పంపుతున్నారు. యువకులను మెట్రో స్టేషన్ పక్కనే ఉన్న పబ్లోకి తీసుకెళ్తున్నారు. గంటలో రూ.40 వేల వరకూ బిల్ చేసి జారుకుంటున్నారు. విషయం తెలుసుకునే లోపే బిల్ కట్టాలని యువకులపై పబ్ యాజమాన్యం ఒత్తిడి తెస్తోంది. పబ్ నిర్వాహకులు, యువతులు కలిసి ఈ స్కాంకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. తాము కూడా బాధితులమేనంటూ పలువురు ముందుకు వస్తున్నారు. అయితే.. దీనిపై ఇప్పటి వరకూ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.
Also read
- Monthly Horoscope July 202: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి మాసఫలాలు
- అత్తింటి వేధింపులు – ఇద్దరు పిల్లలతో బావిలో దూకి మహిళ ఆత్మహత్య
- JEE లో మంచి ర్యాంక్.. NIT లో సీట్.. ఇంజనీరింగ్ ఆపేసి ఏం చేస్తున్నాడో తెలుసా..?
- రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి
- Hyderabad: పబ్బులో డీజే వాయించమంటే.. ఇదా మీరు చేసే గలీజు పని..