హెరిటేజ్ గణతంత్ర దినోత్సవ బహుమతి రూ.50 వేలు
గెలుచుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన లింక్ కాకినాడ(గాంధీనగర్) సైబర్ మోసగాళ్లు కొత్త ఎత్తుగడలు వేస్తూ సామాన్యులకు వల విసురుతున్నారు. పండుగ ఆఫర్లు అంటూ ప్రముఖ కంపెనీల లోగోలతో సామాజిక మాధ్యమాల్లో లింకులు పంపిస్తున్నారు. వాటిపై క్లిక్ చేయగానే ఫోన్లోని డేటా లాగేస్తున్నారు. కాకినాడకు చెందిన కొందరికి శుక్రవారం అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ పే లోగోతో లింక్లు వచ్చాయి. వాటిలో ‘మొదట నేను ఇది నకిలీ అనుకున్నా. కానీ నిజంగా నాకు రూ.5 వేలు వచ్చాయి. మీరు కూడా ప్రయత్నించి చూడండి’ అని ఉంది. ఆ లింక్ ఓపెన్ చేయగానే.. ఈ లింక్ను 5 గ్రూపులు, 15 మంది వ్యక్తులకు పంపితే మీ ఖాతాలో రూ.5 వేలు జమవుతాయని మెసేజ్ వచ్చింది. అది నమ్మిన కొందరు ఆ లింక్ను తెలిసిన వారికి పంపించారు. వాటిని ఓపెన్ చేసిన వారి ఫోన్లు హ్యాక్ అయినట్లు ఫిర్యాదులు వచ్చాయి.
Also read
- అనంత హనీట్రాప్.. రంగమ్మ అరెస్ట్, వీఆర్ కు సీఐలు..
- డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు
- షాపింగ్కు వెళ్లిన భర్త.. సైలెంట్గా ఫాలో అయిన భార్య.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్..!
- వివాహేతర సంబంధం భర్తకు తెలిసిందని..
- రాత్రి పూట పేకాట ఆడేందుకు వెళ్లి మిస్సింగ్.. మిస్టరీగా మారిన ఘటన





