పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో జోగిపేట సమీపంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి మాటలకు నొచ్చుకున్న అతను క్షణికావేశంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పూర్తి వివరాలు కథనం లోపల …
ముప్పై ఏళ్ళు వచ్చిన పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో ఓ యువకుడు నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాడు. తండ్రి అన్న మాటలకు నొచ్చుకొని క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే పెళ్లి ముచ్చట ఆ యువకుడి ప్రాణం తీసింది. పండగలా పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాద ఛాయలు నింపింది. వివరాల్లోకి వెళ్తే.. జోగిపేట మండల పరిధిలోని చిట్కుల్ గ్రామానికి చెందిన తుపాకి అశోక్కి 30 ఏళ్లు. అయితే గత కొంతకాలంగా అతను పెళ్లి కోసం తపించిపోతున్నాడు. తనకు త్వరగా పెళ్లి సంబంధం చూడాలని,నెల రోజుల్లోనే పెళ్లి చేయాలని తన తండ్రి రాములును కోరాడు. అయితే నెల రోజుల్లో సంబంధం కుదిర్చి పెళ్లి చేయడం సాధ్యమవుతుందో లేదో అని తండ్రి బదులిచ్చాడు. దీంతో తండ్రి అన్న మాటలకు తీవ్ర మనస్థాపానికి గురైన అశోక్.. క్షణికావేశంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. తన ఇంట్లో ఉన్న ఇనుప పైపుకు నూలు తాడుతో ఉరివేసుకున్నాడు. కిటికీలోంచి గమనించిన పక్కింటి వారు కేకలు వేయడంతో, కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి అశోక్ను కిందికి దించారు. హుటాహుటిన జోగిపేట ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే అశోక్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
Also read
- జూదమాడుతూ పట్టుబడిన మహిళలు
- ప్రియుడితో కలిసి భర్త హత్య.. నలుగురి అరెస్టు
- కంటిపాపలను చిదిమేసి.. తానూ వెళ్లిపోయింది
- పెరుగు తెచ్చిన తంటా.. భర్తపై అలిగి వెళ్లిపోయిన భార్య
- పోస్టుమార్టం రిపోర్ట్తో వెలుగులోకి వచ్చిన నిజం.. ఆత్మహత్య కాదు హత్య!





