దయనీయ ఘటన వెలుగులోకి వచ్చింది. లలిత అనే గర్భిణి అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందింది. మృతదేహం పట్ల ఆ గ్రామంలోని కొంతమంది పెద్దలు, వ్యవహరించిన తీరు మానవత్వాన్ని మంట కలిపింది. గర్భిణీ స్త్రీ శవాన్ని గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. మహిళ శవాన్ని ఊరి బయటనే అంత్యక్రియలు జరుపడం పలువురు హృదయాలను కదిలించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం లింగగూడెంలో దయనీయ ఘటన వెలుగులోకి వచ్చింది. లలిత అనే గర్భిణి అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందింది. మృతదేహం పట్ల ఆ గ్రామంలోని కొంతమంది పెద్దలు, వ్యవహరించిన తీరు మానవత్వాన్ని మంట కలిపింది. గర్భిణీ స్త్రీ శవాన్ని గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. మహిళ శవాన్ని ఊరి బయటనే అంత్యక్రియలు జరుపడం పలువురు హృదయాలను కదిలించింది.
బొమ్మెర లలిత అనే గర్భిణీ అనారోగ్యం పాలైంది. దీంతో ఆమెను కుటుంబసభ్యులు ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 17వ తేదీన మృతి చెందింది. అయితే, లలిత శవాన్ని లింగగూడెంకు తీసుకొస్తుండగా కొంతమంది అడ్డుకున్నారు. గ్రామానికి కీడు వస్తుందని శవానికి మూఢనమ్మకానికి ముడిపెట్టి, గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. మృతురాలి బంధువులు చేసేది ఏమీ లేక లింగగూడెం ఊరు బయటనే చలిలోనే వణుకుతూ అంత్యక్రియలు నిర్వహించారు.
ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండి గ్రామ పెద్దలను ఒప్పించలేక, రాత్రికి అంత్యక్రియలు జరిపారు. లలితకు లింగగూడెంలో సొంత ఇల్లు ఉంది. భర్త ఉన్నాడు. ఆమె అనారోగ్యంతో చనిపోతే సానుభూతి చూపించాల్సిన గ్రామస్తులు, దుఃఖ సాగరంలో ఉన్న మృతురాలి బంధువులను ఇబ్బందులకు గురి చేశారు. గర్భిణీ స్త్రీ శవం గ్రామంలోకి వస్తే కీడు వస్తుందని నమ్మి గ్రామంలోకి శవాన్ని రానివ్వలేదని లలిత కుటుంబసభ్యులు తెలిపారు.
Also Read
- మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి సజీవ బృందావనం- ఈ పవిత్ర క్షేత్రం గురించి తెలుసా?
- Weekly Horoscope: ఈ రాశులకు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు
- శ్రావణ సోమవారం: మార్కండేయుడిని మృత్యువు నుంచి కాపాడిన శివుడు.. భక్తికి ఉన్న శక్తి ఇదే!
- పాండవుల కోసం శ్రీకృష్ణుడు కోరిన ఆ 5 గ్రామాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? నేటి పేర్లు ఇవే!
- Mala Japa Rules: జపమాలతో మంత్రం జపిస్తున్నారా?.. ఈ చూపుడు వేలు నియమం మీకు తెలుసా?





