ప్రేమించుకున్నారు.. పెద్దల నిర్ణయంతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకున్నారు. కొత్త జీవితాన్ని కూడా ప్రారంభించారు. కానీ వివాహం జరిగిన వారం రోజులకే వారికి ఊహించని పరిణామం ఎదురైంది. అర్ధరాత్రి వరుడి ఇంటిపైకి వచ్చిన సుమారు 20 మంది.. దాడి చేసి, నవవధువును బలవంతంగా ఎత్తుకెళ్లారు.రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసి ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో సినీ ఫక్కిలో జరిగిన ఓ కిడ్నాప్ ఉదంతం తీవ్ర కలకలం రేపింది. చిత్తాపూర్ గ్రామంలో ప్రేమ వివాహం చేసుకున్న ఒక యువతిని ఆమె కుటుంబ సభ్యులే దౌర్జన్యంగా కిడ్నాప్ చేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం .. చిత్తాపూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు, సంతోష్ నగర్ కు చెందిన కళ్యాణి (26) అనే యువతి వారం రోజుల క్రితం యాదగిరిగుట్ట వద్ద ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం వారు అబ్బాయి ఇంటి వద్దే ఉంటున్నారు. అయితే ఈ వివాహం ఇష్టం లేని అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు సుమారు 20 మందికి పైగా కలిసి రాత్రి వేళ అబ్బాయి ఇంటిపై ఒక్కసారిగా దాడికి దిగారు. ఇంట్లోకి చొరబడి వధువు కళ్యాణిని రాత్రి సమయలో బలవంతంగా అపహరించి తీసుకెళ్లారు.
కుటుంబ సభ్యుల ద్వారా ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని ఎత్తుకెళుతున్నారన్న విషయం తెలుసుకున్న యువకుడు.. వారిని అడ్డగించదంతో కారును వదిలేసి పారిపోయారు. ఈ అకస్మాత్తు దాడితో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బాధితుడు ప్రవీణ్ ఫిర్యాదు మేరకు మంచాల పోలీసులు కేసు నమోదు చేసి, కిడ్నాప్కు పాల్పడిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఘటన వెనుక ప్రేమ వివాహమే ప్రధాన కారణమా? యువతిని ఎవరు తీసుకెళ్లారు? ఆమె ప్రస్తుతం ఎక్కడ ఉంది? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Also read
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్కు వెళ్లింది.. కట్చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!
- తల్లి మృతిని తట్టుకోలేక.. భార్యను చంపి భర్త ఆత్మహత్య
- లాయర్ అయితే నాకేంటి.. చంపకుండా ఇక్కడి నుంచి వెళ్లను!’
- రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ డీసీపీ కుమార్తె మృతి




